హైదరాబాద్, ఆగస్టు 20:
మారుతున్న విద్యా రంగానికి అనుగుణంగా ఉపాధ్యాయులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలని డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి అన్నారు. ఏఐ వినియోగంతో బోధన, అభ్యసన ప్రక్రియ మరింత సమర్థవంతంగా మారుతుందన్నారు. ‘ఉపాధ్యాయులకు కృత్రిమ మేధస్సు’ అంశంపై 15 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని గురువారం వర్సిటీలో ప్రారంభించారు.
అన్ని స్కూళ్లలో డిజిటల్ ల్యాబ్లు
రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో త్వరలో ఐసీటీ ల్యాబ్లు ఏర్పాటు చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, డైరెక్టర్ డా. నవీన్ నికోలస్, ఐఏఎస్ తెలిపారు. పాఠ్య ప్రణాళిక, డిజిటల్ కంటెంట్ తయారీ, మూల్యాంకనం తదితరాల్లో ఏఐ సాధనాలు ఉపాధ్యాయులకు ఉపయోగపడతాయన్నారు. ప్రధానోపాధ్యాయులకు పాఠశాల పరిపాలనపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.
1,509 మంది టీచర్లకు శిక్షణ
ఏఐని బాధ్యతాయుతంగా, సమర్థంగా వినియోగించేలా ఉపాధ్యాయులను తీర్చిదిద్దడమే శిక్షణ లక్ష్యమని COEL డైరెక్టర్ ప్రొ. జి. పుష్ప చక్రపాణి తెలిపారు. బోధన, డిజిటల్ కంటెంట్ అభివృద్ధి, మూల్యాంకనం, విద్యార్థులకు సహాయం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 1,509 మంది ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డా. ఎల్. విజయ్ కృష్ణారెడ్డి, ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ హరి, శిక్షకులు, యూనివర్సిటీ అధ్యాపకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి