Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రూ.500 కోసం కన్న తండ్రినే హత్య చేసిన కుమారుడు తరగతి గదిలో గురువులు.. ఉద్యోగంలో మాత్రం అతిథులే! కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 20, 2026 09:46 PM

అంకిరెడ్డిగూడెంలో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన సదస్సు

అంకిరెడ్డిగూడెంలో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన సదస్సు

అంకిరెడ్డిగూడెంలో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన సదస్సు
20-08-2026 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఆరుతడి పంటల వైపే మొగ్గు చూపాలి: ఏఈఓ వీణ

భూమిని బీడు ఉంచితే పథకాలు వర్తించవు: సర్పంచ్ మల్లేష్ గౌడ్

వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయడం ద్వారా రైతులు సత్వర లాభాలు పొందవచ్చని లింగోజిగూడెం వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈఓ) వీణ తెలిపారు. చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ అధ్యక్షతన గురువారం ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ​ఈ సందర్భంగా ఏఈఓ వీణ మాట్లాడుతూ, ఎల్ నినో పరిస్థితుల వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఇలాంటి సమయంలో వరి వేస్తే దిగుబడి తగ్గి నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా కంది, పెసర, మినుము, బొబ్బర్లు, శనగలు, ఉలువలు, కూరగాయల పంటలు వేసుకోవాలని రైతులకు సూచించారు. సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ, ప్రతి రైతు తమ భూమిని ఖాళీగా ఉంచకుండా తప్పనిసరిగా ఏదో ఒక పంటను సాగు చేయాలన్నారు. భూమిని బీడుగా ఉంచితే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పొందేందుకు అర్హత కోల్పోతారని స్పష్టం చేశారు.

​ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు కాకులారం మల్లారెడ్డి, దొడ్ల సెట్టయ్య, పర్ని రామచంద్రరెడ్డి, ఇటికాల నర్సిరెడ్డి, భీమగోని బాలరాజ్, మోడెపు నరసింహ, పెంటయ్య, జంగయ్య, ముద్దం సెట్టయ్య, వెంకటేశం, శ్రీను ముత్యాలు, సుర్వి లచ్చయ్య, రాములు, దాసు, గంగిరెడ్డి అంజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, భూపాల్ రెడ్డి, ఇమ్మడి ఏసుదాస్, ఇరగదిండ్ల ఈద్దయ్య, కే యాదిరెడ్డి, కే జంగారెడ్డి తదితర రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Sthanikam

అంకిరెడ్డిగూడెంలో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన సదస్సు

Article Image

ఆరుతడి పంటల వైపే మొగ్గు చూపాలి: ఏఈఓ వీణ

భూమిని బీడు ఉంచితే పథకాలు వర్తించవు: సర్పంచ్ మల్లేష్ గౌడ్

వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయడం ద్వారా రైతులు సత్వర లాభాలు పొందవచ్చని లింగోజిగూడెం వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈఓ) వీణ తెలిపారు. చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ అధ్యక్షతన గురువారం ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ​ఈ సందర్భంగా ఏఈఓ వీణ మాట్లాడుతూ, ఎల్ నినో పరిస్థితుల వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఇలాంటి సమయంలో వరి వేస్తే దిగుబడి తగ్గి నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా కంది, పెసర, మినుము, బొబ్బర్లు, శనగలు, ఉలువలు, కూరగాయల పంటలు వేసుకోవాలని రైతులకు సూచించారు. సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ, ప్రతి రైతు తమ భూమిని ఖాళీగా ఉంచకుండా తప్పనిసరిగా ఏదో ఒక పంటను సాగు చేయాలన్నారు. భూమిని బీడుగా ఉంచితే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పొందేందుకు అర్హత కోల్పోతారని స్పష్టం చేశారు.

​ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు కాకులారం మల్లారెడ్డి, దొడ్ల సెట్టయ్య, పర్ని రామచంద్రరెడ్డి, ఇటికాల నర్సిరెడ్డి, భీమగోని బాలరాజ్, మోడెపు నరసింహ, పెంటయ్య, జంగయ్య, ముద్దం సెట్టయ్య, వెంకటేశం, శ్రీను ముత్యాలు, సుర్వి లచ్చయ్య, రాములు, దాసు, గంగిరెడ్డి అంజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, భూపాల్ రెడ్డి, ఇమ్మడి ఏసుదాస్, ఇరగదిండ్ల ఈద్దయ్య, కే యాదిరెడ్డి, కే జంగారెడ్డి తదితర రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News