ఆరుతడి పంటల వైపే మొగ్గు చూపాలి: ఏఈఓ వీణ
భూమిని బీడు ఉంచితే పథకాలు వర్తించవు: సర్పంచ్ మల్లేష్ గౌడ్
వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయడం ద్వారా రైతులు సత్వర లాభాలు పొందవచ్చని లింగోజిగూడెం వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈఓ) వీణ తెలిపారు. చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ అధ్యక్షతన గురువారం ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈఓ వీణ మాట్లాడుతూ, ఎల్ నినో పరిస్థితుల వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఇలాంటి సమయంలో వరి వేస్తే దిగుబడి తగ్గి నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా కంది, పెసర, మినుము, బొబ్బర్లు, శనగలు, ఉలువలు, కూరగాయల పంటలు వేసుకోవాలని రైతులకు సూచించారు. సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ, ప్రతి రైతు తమ భూమిని ఖాళీగా ఉంచకుండా తప్పనిసరిగా ఏదో ఒక పంటను సాగు చేయాలన్నారు. భూమిని బీడుగా ఉంచితే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పొందేందుకు అర్హత కోల్పోతారని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు కాకులారం మల్లారెడ్డి, దొడ్ల సెట్టయ్య, పర్ని రామచంద్రరెడ్డి, ఇటికాల నర్సిరెడ్డి, భీమగోని బాలరాజ్, మోడెపు నరసింహ, పెంటయ్య, జంగయ్య, ముద్దం సెట్టయ్య, వెంకటేశం, శ్రీను ముత్యాలు, సుర్వి లచ్చయ్య, రాములు, దాసు, గంగిరెడ్డి అంజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, భూపాల్ రెడ్డి, ఇమ్మడి ఏసుదాస్, ఇరగదిండ్ల ఈద్దయ్య, కే యాదిరెడ్డి, కే జంగారెడ్డి తదితర రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి