Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రూ.500 కోసం కన్న తండ్రినే హత్య చేసిన కుమారుడు తరగతి గదిలో గురువులు.. ఉద్యోగంలో మాత్రం అతిథులే! కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 20, 2026 09:47 PM

గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బోనాల వేడుకలు

గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బోనాల వేడుకలు

గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బోనాల వేడుకలు
20-08-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అలరించిన పోతరాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాలు

స్థానిక శ్రీ గాయత్రి జూనియర్, డిగ్రీ కళాశాలలో బోనాల మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ప్రాంగణంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అలకరించిన బోనాలతో విద్యార్థినులు ఊరేగింపుగా తరలివచ్చారు. డప్పు వాయిద్యాలు, పోతరాజుల విన్యాసాలు, విద్యార్థుల సాంప్రదాయ నృత్యాలతో కళాశాల పరిసరాలు పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన చౌటుప్పల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బోనాలు ప్రకృతిని, శక్తిని పూజించే గొప్ప సంప్రదాయమని కొనియాడారు. విద్యార్థులు విద్యతో పాటు సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాలని, సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు. వేడుకలను ప్రశాంత వాతావరణంలో, క్రమశిక్షణతో నిర్వహించిన యాజమాన్యాన్ని అభినందించారు. కళాశాల కరెస్పాండెంట్ భీమిడి సుభాష్ రెడ్డి, చైర్మన్ బండారు మయూరి రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులలో నైతిక విలువలు, పాశ్చాత్య ధోరణులను అధిగమించి సాంప్రదాయాల పట్ల గౌరవం పెంచేందుకే ఈ ఉత్సవాన్ని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ దయాకర్, ఆంజనేయులు, అధ్యాపక బృందం, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బోనాల వేడుకలు

Article Image

అలరించిన పోతరాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాలు

స్థానిక శ్రీ గాయత్రి జూనియర్, డిగ్రీ కళాశాలలో బోనాల మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ప్రాంగణంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అలకరించిన బోనాలతో విద్యార్థినులు ఊరేగింపుగా తరలివచ్చారు. డప్పు వాయిద్యాలు, పోతరాజుల విన్యాసాలు, విద్యార్థుల సాంప్రదాయ నృత్యాలతో కళాశాల పరిసరాలు పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన చౌటుప్పల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బోనాలు ప్రకృతిని, శక్తిని పూజించే గొప్ప సంప్రదాయమని కొనియాడారు. విద్యార్థులు విద్యతో పాటు సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాలని, సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు. వేడుకలను ప్రశాంత వాతావరణంలో, క్రమశిక్షణతో నిర్వహించిన యాజమాన్యాన్ని అభినందించారు. కళాశాల కరెస్పాండెంట్ భీమిడి సుభాష్ రెడ్డి, చైర్మన్ బండారు మయూరి రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులలో నైతిక విలువలు, పాశ్చాత్య ధోరణులను అధిగమించి సాంప్రదాయాల పట్ల గౌరవం పెంచేందుకే ఈ ఉత్సవాన్ని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ దయాకర్, ఆంజనేయులు, అధ్యాపక బృందం, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News