లక్కారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నివాళులు అర్పించిన కాంగ్రెస్ శ్రేణులు
భారత రత్న, ఆధునిక సాంకేతిక విప్లవ నిర్మాత, మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను చౌటుప్పల్ మున్సిపాలిటీ లక్కారంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి, నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, దేశానికి రాజీవ్ గాంధీ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. దేశంలో కంప్యూటర్, ఐటీ విప్లవానికి నాంది పలికింది రాజీవ్ గాంధీయేనని గుర్తుచేశారు. యువతకు సాధికారత కల్పిస్తూ 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. దేశ ఐక్యత, సమానత్వం కోసం రాజీవ్ గాంధీ తన ప్రాణాలను సైతం త్యాగం చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి, మండల, మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోయ దేవేందర్, కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ తిగుళ్ళ చంద్రయ్య, కో ఆప్షన్ సభ్యులు బాబా షరీఫ్, పస్తం గంగారాం, దేవాలయ చైర్మన్ బొబ్బిల్ల మురళి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు డిల్లీ చంద్రకళ, పబ్బు శ్రీకాంత్, బోయ వెంకట్, చిమ్ముల వెంకట్ రెడ్డి, శంకర్ నాయక్, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బక్క శ్రీనాథ్, బత్తుల శ్రీహరి, షాదీ ఖానా చైర్మన్ ఎం.డి. కరీం, ఆవుల యేసు, లచ్చునాయక్, బండమీద వెంకటేశం, తొర్పునూరి శ్రీకాంత్, కడగంచి జనార్ధన్, పాశం కృష్ణ, కొండె నరసింహ, ఉదరీ రమేష్, నరసింహచారి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి