మాతృమూర్తి మృతి పట్ల యాదాద్రి జిల్లా నాయకుల సంతాపం
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టియుడబ్ల్యూజే-ఐజేయు) రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ మాతృమూర్తి బాషారత్ ఉన్నిసాబేగం అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయం తెలిసిన యాదాద్రి భువనగిరి జిల్లా యూనియన్ నాయకులు గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో విరహత్ అలీని కలిసి పరామర్శించారు.ఆమె చిత్రపటానికి అశ్రునివాళులర్పించిన నాయకులు, విరహత్ అలీతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పరామర్శించిన వారిలో ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు జీవి శ్రీనివాస్, ఎలిమినేటి ఇంద్రారెడ్డి, టియుడబ్ల్యూజే యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు యంబ నరసింహులు, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతంశెట్టి కరుణాకర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు వెలిమినేటి జహంగీర్, జిల్లా నాయకుడు కందుకూరీ సోమయ్య, పట్టణ మాజీ కార్యదర్శి జమాలుద్దీన్ తదితరులు ఉన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి