జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్యక్రమాలు
అన్యాయం జరిగితే ధైర్యంగా పోలీసులను ఆశ్రయించాలి: ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్
మహిళల భద్రత, బాలల రక్షణే ధ్యేయంగా యాదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన సదస్సులు నిర్వహించారు. జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో అధికారులు ఈ కార్యక్రమాలను చేపట్టారు.ఈ సందర్భంగా విద్యార్థులు, మహిళలు, స్థానిక ప్రజలకు సైబర్ నేరాలు, గృహ హింస, బాలల అక్రమ రవాణా, వేధింపుల నివారణపై అవగాహన కల్పించారు. ఏవైనా ప్రమాదకర పరిస్థితులు ఎదురైతే భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని అధికారులు సూచించారు. బాలల రక్షణలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
సమాజంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములైతేనే నేరాల రహిత వాతావరణం సాధ్యమవుతుందని, ఈ దిశగా క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని ఎస్పీ ఆదేశించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి