Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సింగిల్‌ విండోల్లో ఎంఆర్‌పీ ధరకే యూరియా అమ్మాలి;తాటికొండ సీతయ్య తరగతి గదిలో గురువులు.. ఉద్యోగంలో మాత్రం అతిథులే! కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 21, 2026 06:26 PM

సదాశివపేటలో ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం

సదాశివపేటలో ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం

సదాశివపేటలో ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం
21-08-2026 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సదాశివపేటలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల అధ్యక్షులు నిజాంపూర్ అశోక్, కార్యదర్శి తంగడిపల్లి లక్ష్మణ్, సాయిరాం షాపింగ్ మాల్ యజమాని ప్రకాష్, ప్రముఖ వ్యాపారవేత్త గోవింద్ సోమనీ, జర్నలిస్టు ఉల్లిగడ్డల అనిత శివకుమార్ దంపతులు పాల్గొని దీప ప్రజ్వలన చేశారు. 14వ వార్డు కౌన్సిలర్ ఉల్లిగడ్డల ఉమారాణి–నాగరాజు దంపతులు ప్రధాన పీఠంపై కూర్చొని వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 56 మంది పోషకులు, మరో 150 మంది మాతాజీలు, భక్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాలలో ఎన్నో సంవత్సరాలుగా సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహిస్తున్నామని కవిత రవీందర్ రాందాస్ తెలిపారు. మనం చేసే ప్రతి పనిని భక్తిశ్రద్ధలతో చేయాలని, పిల్లలను దైవస్వరూపంగా భావించాలని సూచించారు. అనంతరం నిర్వహించిన లక్కీడ్రాలో ఐదుగురు మహిళలకు చీరలను బహుమతిగా అందజేశారు. శిల్ప, అర్చిత, లావణ్య, అంజమ్మ, సుమలత బహుమతులు అందుకున్నారు. పాఠశాల ప్రధానాచార్యులు తమ్మలి సంగమేశ్వర్ మాట్లాడుతూ వ్రతంలో పాల్గొన్న ప్రతి కుటుంబానికి సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ధనధాన్యాలు, సంతానాభివృద్ధి కలగాలని ఆకాంక్షించారు.

Sthanikam

సదాశివపేటలో ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం

Article Image

సదాశివపేటలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల అధ్యక్షులు నిజాంపూర్ అశోక్, కార్యదర్శి తంగడిపల్లి లక్ష్మణ్, సాయిరాం షాపింగ్ మాల్ యజమాని ప్రకాష్, ప్రముఖ వ్యాపారవేత్త గోవింద్ సోమనీ, జర్నలిస్టు ఉల్లిగడ్డల అనిత శివకుమార్ దంపతులు పాల్గొని దీప ప్రజ్వలన చేశారు. 14వ వార్డు కౌన్సిలర్ ఉల్లిగడ్డల ఉమారాణి–నాగరాజు దంపతులు ప్రధాన పీఠంపై కూర్చొని వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 56 మంది పోషకులు, మరో 150 మంది మాతాజీలు, భక్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాలలో ఎన్నో సంవత్సరాలుగా సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహిస్తున్నామని కవిత రవీందర్ రాందాస్ తెలిపారు. మనం చేసే ప్రతి పనిని భక్తిశ్రద్ధలతో చేయాలని, పిల్లలను దైవస్వరూపంగా భావించాలని సూచించారు. అనంతరం నిర్వహించిన లక్కీడ్రాలో ఐదుగురు మహిళలకు చీరలను బహుమతిగా అందజేశారు. శిల్ప, అర్చిత, లావణ్య, అంజమ్మ, సుమలత బహుమతులు అందుకున్నారు. పాఠశాల ప్రధానాచార్యులు తమ్మలి సంగమేశ్వర్ మాట్లాడుతూ వ్రతంలో పాల్గొన్న ప్రతి కుటుంబానికి సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ధనధాన్యాలు, సంతానాభివృద్ధి కలగాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News