మున్సిపల్ అధ్యక్షురాలి ఆధ్వర్యంలో ఘన సన్మానం
భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపాలిటీ సీనియర్ నాయకుడు, లింగోజిగూడెం మాజీ ఉపసర్పంచ్ పిల్ల బుచ్చయ్య ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం చౌటుప్పల్లో మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పన యాదవ్ ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం కల్పన యాదవ్ మాట్లాడుతూ.. లింగోజిగూడెం గ్రామానికి, స్థానిక ప్రజలకు బుచ్చయ్య అందించిన సేవలను గుర్తించే పార్టీ ఆయనకు ఈ బాధ్యతలను అప్పగించిందన్నారు. జిల్లా కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు, సీనియర్ నాయకుడు రమణగొని శంకరయ్య మాట్లాడుతూ.. నూతన బాధ్యతలు స్వీకరించిన పిల్ల బుచ్చయ్య పార్టీ బలోపేతానికి, ప్రజల సంక్షేమానికి మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పోలపల్లి లక్ష్మీ ముత్తయ్య, బూత్ అధ్యక్షుడు బాతరాజు ప్రవీణ్, సీనియర్ నాయకులు పర్నే అంజిరెడ్డి, రమణగొని నరసింహ, తోర్పునూరి నరసింహ, ఊదరి రంగయ్య, ఎర్రగోని మల్లేశం, పోలపల్లి భాస్కర్, ఎర్ర నరసింహ, పిల్ల యాదయ్య, పిల్ల శ్రీకాంత్, పిల్ల సురేష్, పిల్ల శ్రీధర్, పిల్ల రవిచంద్ర, కోయిలగూడెం శ్రీశైలం, గుండపల్లి వెంకటరెడ్డి, రమేష్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి