జహీరాబాద్లోని మహిళా కాంగ్రెస్ కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో స్వచ్ఛందంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అస్మా మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని, గ్రామాల్లోని సమస్యలను తమ పరిధిలో పరిష్కరించడంతో పాటు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు, చెడు వ్యసనాలు, అనవసరమైన బెట్టింగ్ యాప్లకు యువత దూరంగా ఉండేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందేలా నాయకులు కృషి చేయాలని, నియోజకవర్గంలో జరుగుతున్న స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి జహీరాబాద్ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారికి మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆర్థిక సహాయం, ఒకే విధమైన దుస్తులను అందించారు. కార్యక్రమంలో ప్రశాంత్, రాములు, భాగవత్, సోహెల్, శ్రీకాంత్, భాను ప్రసాద్, ఆసిఫ్ మియా, గుండప్ప, కల్లెప్ప, కృష్ణచారి, అవినాష్ రెడ్డి, మోహన్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛంద సేవలతో జహీరాబాద్ అభివృద్ధికి కృషి చేయాలి:అధ్యక్షురాలు అస్మా
స్వచ్ఛంద సేవలతో జహీరాబాద్ అభివృద్ధికి కృషి చేయాలి:అధ్యక్షురాలు అస్మా
Krishna
జహీరాబాద్లోని మహిళా కాంగ్రెస్ కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో స్వచ్ఛందంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అస్మా మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని, గ్రామాల్లోని సమస్యలను తమ పరిధిలో పరిష్కరించడంతో పాటు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు, చెడు వ్యసనాలు, అనవసరమైన బెట్టింగ్ యాప్లకు యువత దూరంగా ఉండేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందేలా నాయకులు కృషి చేయాలని, నియోజకవర్గంలో జరుగుతున్న స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి జహీరాబాద్ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారికి మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆర్థిక సహాయం, ఒకే విధమైన దుస్తులను అందించారు. కార్యక్రమంలో ప్రశాంత్, రాములు, భాగవత్, సోహెల్, శ్రీకాంత్, భాను ప్రసాద్, ఆసిఫ్ మియా, గుండప్ప, కల్లెప్ప, కృష్ణచారి, అవినాష్ రెడ్డి, మోహన్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి