Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్వచ్ఛంద సేవలతో జహీరాబాద్ అభివృద్ధికి కృషి చేయాలి:అధ్యక్షురాలు అస్మా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి పెనుగొండ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి:- సవితమ్మ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 22, 2026 09:54 PM

స్వచ్ఛంద సేవలతో జహీరాబాద్ అభివృద్ధికి కృషి చేయాలి:అధ్యక్షురాలు అస్మా

స్వచ్ఛంద సేవలతో జహీరాబాద్ అభివృద్ధికి కృషి చేయాలి:అధ్యక్షురాలు అస్మా

స్వచ్ఛంద సేవలతో జహీరాబాద్ అభివృద్ధికి కృషి చేయాలి:అధ్యక్షురాలు  అస్మా
22-08-2026 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జహీరాబాద్‌లోని మహిళా కాంగ్రెస్ కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో స్వచ్ఛందంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అస్మా మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని, గ్రామాల్లోని సమస్యలను తమ పరిధిలో పరిష్కరించడంతో పాటు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు, చెడు వ్యసనాలు, అనవసరమైన బెట్టింగ్ యాప్‌లకు యువత దూరంగా ఉండేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందేలా నాయకులు కృషి చేయాలని, నియోజకవర్గంలో జరుగుతున్న స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి జహీరాబాద్ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారికి మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆర్థిక సహాయం, ఒకే విధమైన దుస్తులను అందించారు. కార్యక్రమంలో ప్రశాంత్, రాములు, భాగవత్, సోహెల్, శ్రీకాంత్, భాను ప్రసాద్, ఆసిఫ్ మియా, గుండప్ప, కల్లెప్ప, కృష్ణచారి, అవినాష్ రెడ్డి, మోహన్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

స్వచ్ఛంద సేవలతో జహీరాబాద్ అభివృద్ధికి కృషి చేయాలి:అధ్యక్షురాలు అస్మా

Article Image

జహీరాబాద్‌లోని మహిళా కాంగ్రెస్ కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో స్వచ్ఛందంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అస్మా మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని, గ్రామాల్లోని సమస్యలను తమ పరిధిలో పరిష్కరించడంతో పాటు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు, చెడు వ్యసనాలు, అనవసరమైన బెట్టింగ్ యాప్‌లకు యువత దూరంగా ఉండేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందేలా నాయకులు కృషి చేయాలని, నియోజకవర్గంలో జరుగుతున్న స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి జహీరాబాద్ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారికి మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆర్థిక సహాయం, ఒకే విధమైన దుస్తులను అందించారు. కార్యక్రమంలో ప్రశాంత్, రాములు, భాగవత్, సోహెల్, శ్రీకాంత్, భాను ప్రసాద్, ఆసిఫ్ మియా, గుండప్ప, కల్లెప్ప, కృష్ణచారి, అవినాష్ రెడ్డి, మోహన్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News