నల్గొండ, ఆగస్టు 22: పాలిటెక్నిక్ కళాశాలలకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా వెంకటేష్ మాదిగ డిమాండ్ చేశారు. చేవెళ్ల డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.
శనివారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టర్, మెజిస్ట్రేట్ బి. చంద్రశేఖర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాదిగ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి (కార్మిక) శాఖ పరిధిలోకి తీసుకురావడంతో పాటు స్కిల్స్ యూనివర్సిటీకి అనుసంధానం చేస్తూ తీసుకొచ్చిన జీవో 97ను వెంటనే రద్దు చేయాలని కోరారు.
చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్రజా గర్జన సభలో దళిత, గిరిజన వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంబేడ్కర్ అభయహస్తం కింద ప్రతి దళిత కుటుంబానికి రూ.12 లక్షలు అందించాలని, రాజీవ్ యువ వికాసం కింద దరఖాస్తు చేసుకున్న లక్షలాది మంది నిరుద్యోగులకు తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని కోరారు. కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో గొల్ల కురుమ డోలు దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మాల్గ యాదయ్య, ఎమ్మార్పీఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు ముదిగొండ వెంకటేశ్వర్లు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నారపాక అంజి మాదిగ, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర యాదవ్, మునుగోడు ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జి పూదరి సైదులు, సాగర్ నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు ఆదిమళ్ల సత్యనారాయణ, చనగళ్ల కోటేష్, యడవెళ్లి శ్రీనివాస్, రేపాక శ్రీను తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి