తక్షణమే కొత్త లైట్లు ఏర్పాటు చేయాలి: బీఆర్ఎస్ నాయకుడు బోలుగురి సైదులు.
చిట్యాల మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని 12వ వార్డులో గత కొన్ని రోజులుగా వీధి దీపాలు వెలగకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో ప్రధాన వీధులు, కాలనీ మార్గాలు చీకటిమయంగా మారడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వీధి దీపాలు పనిచేయకపోవడంపై సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదని కాలనీవాసులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి పాడైన దీపాలను తొలగించి, కొత్త వీధి దీపాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకుడు బోలుగురి సైదులు కోరారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి