పోలీస్ సిబ్బంది సంక్షేమం, వారి సమస్యల పరిష్కారంలో పోలీస్ అసోసియేషన్ కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ అన్నారు. సంగారెడ్డి జిల్లాలో పోలీస్ అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియను సిబ్బంది పరస్పర సమన్వయం, సహకారంతో ఎలాంటి ఓటింగ్ లేకుండా ఏకగ్రీవంగా పూర్తి చేయడం అభినందనీయమని తెలిపారు.జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా హెడ్ కానిస్టేబుల్ ఎ. జనార్ధన్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, ఉపాధ్యక్షులుగా ఇన్స్పెక్టర్ బి. రమేష్, ఎస్ఐ బి. నాగలక్ష్మి ఎన్నికయ్యారు.ప్రధాన కార్యదర్శిగా ఆర్ఐ రాజశేఖర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా ఎం. రాజారామ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా జి. సంతోష్ కుమార్, ఖజానాదారుగా కూన రమేష్ ఎన్నికయ్యారు. వీరితో పాటు పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు.నూతన కార్యవర్గ సభ్యులను ఎస్పీ పరితోష్ పంకజ్ అభినందిస్తూ, పదవి రావడంతో బాధ్యత కూడా పెరుగుతుందని అన్నారు. పోలీస్ సిబ్బంది సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. సిబ్బంది సంక్షేమం, వారి హక్కులు, సంక్షేమ కార్యక్రమాల అమలులో అసోసియేషన్ చురుకైన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఎన్నికల ప్రక్రియను సమన్వయం చేసిన అదనపు ఎస్పీ చైతన్య రెడ్డిని కూడా ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సురేందర్ రెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ సదా నాగరాజు, పోలీస్ అసోసియేషన్ ప్రతినిధులు, అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పదవితో బాధ్యత పెరుగుతుంది.. సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి: జిల్లా ఎస్పీ
పదవితో బాధ్యత పెరుగుతుంది.. సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి: జిల్లా ఎస్పీ
Krishna
పోలీస్ సిబ్బంది సంక్షేమం, వారి సమస్యల పరిష్కారంలో పోలీస్ అసోసియేషన్ కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ అన్నారు. సంగారెడ్డి జిల్లాలో పోలీస్ అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియను సిబ్బంది పరస్పర సమన్వయం, సహకారంతో ఎలాంటి ఓటింగ్ లేకుండా ఏకగ్రీవంగా పూర్తి చేయడం అభినందనీయమని తెలిపారు.జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా హెడ్ కానిస్టేబుల్ ఎ. జనార్ధన్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, ఉపాధ్యక్షులుగా ఇన్స్పెక్టర్ బి. రమేష్, ఎస్ఐ బి. నాగలక్ష్మి ఎన్నికయ్యారు.ప్రధాన కార్యదర్శిగా ఆర్ఐ రాజశేఖర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా ఎం. రాజారామ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా జి. సంతోష్ కుమార్, ఖజానాదారుగా కూన రమేష్ ఎన్నికయ్యారు. వీరితో పాటు పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు.నూతన కార్యవర్గ సభ్యులను ఎస్పీ పరితోష్ పంకజ్ అభినందిస్తూ, పదవి రావడంతో బాధ్యత కూడా పెరుగుతుందని అన్నారు. పోలీస్ సిబ్బంది సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. సిబ్బంది సంక్షేమం, వారి హక్కులు, సంక్షేమ కార్యక్రమాల అమలులో అసోసియేషన్ చురుకైన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఎన్నికల ప్రక్రియను సమన్వయం చేసిన అదనపు ఎస్పీ చైతన్య రెడ్డిని కూడా ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సురేందర్ రెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ సదా నాగరాజు, పోలీస్ అసోసియేషన్ ప్రతినిధులు, అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి