Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్వచ్ఛంద సేవలతో జహీరాబాద్ అభివృద్ధికి కృషి చేయాలి:అధ్యక్షురాలు అస్మా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి పెనుగొండ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి:- సవితమ్మ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 22, 2026 09:52 PM

విద్యార్థి నాయకత్వానికి ఓటు.. ప్రజాస్వామ్యానికి బాట

విద్యార్థి నాయకత్వానికి ఓటు.. ప్రజాస్వామ్యానికి బాట

విద్యార్థి నాయకత్వానికి ఓటు.. ప్రజాస్వామ్యానికి బాట
22-08-2026 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో శనివారం స్కూల్ పీపుల్ లీడర్ ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు, ఎన్నికల ప్రక్రియపై ఆచరణాత్మక అవగాహన కల్పించే ఉద్దేశంతో పాఠశాల యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

ఎన్నికల్లో విద్యార్థులు తమకు నచ్చిన ప్రతినిధులకు ఓటు వేసి నాయకులను ఎన్నుకున్నారు. బాలుర విభాగంలో 9వ తరగతికి చెందిన ఏ. సాత్విక్ స్కూల్ పీపుల్ లీడర్‌గా, బాలికల విభాగంలో ఆగు దివ్యభాను ఎన్నికయ్యారు. స్పోర్ట్స్ హెడ్ బాయ్‌గా ఎస్.కె. సోను సోయల్, స్పోర్ట్స్ హెడ్ గర్ల్‌గా ఆర్. వైష్ణవి విజయం సాధించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన నాయకులతో పాఠశాల నిబంధనల ప్రకారం ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఎన్నికల ప్రక్రియను విద్యార్థులకు చిన్ననాటి నుంచే ఆచరణాత్మకంగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో స్కూల్ ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలతో పాటు సమాజం పట్ల బాధ్యత, నైతిక విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని పెంపొందిస్తాయని అన్నారు.

విద్యార్థుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేసే నైపుణ్యం కూడా ఇటువంటి ఎన్నికల ద్వారా పెంపొందుతుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నాయకులను ఎన్నుకోవడం, బాధ్యతలను నిర్వర్తించడం ద్వారా విద్యార్థులకు భవిష్యత్‌లో నాయకత్వ లక్షణాలు మరింతగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు.

కార్యక్రమంలో పాఠశాల ఏవో పోల గోవర్ధన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థి నాయకత్వానికి ఓటు.. ప్రజాస్వామ్యానికి బాట

Article Image

చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో శనివారం స్కూల్ పీపుల్ లీడర్ ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు, ఎన్నికల ప్రక్రియపై ఆచరణాత్మక అవగాహన కల్పించే ఉద్దేశంతో పాఠశాల యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

ఎన్నికల్లో విద్యార్థులు తమకు నచ్చిన ప్రతినిధులకు ఓటు వేసి నాయకులను ఎన్నుకున్నారు. బాలుర విభాగంలో 9వ తరగతికి చెందిన ఏ. సాత్విక్ స్కూల్ పీపుల్ లీడర్‌గా, బాలికల విభాగంలో ఆగు దివ్యభాను ఎన్నికయ్యారు. స్పోర్ట్స్ హెడ్ బాయ్‌గా ఎస్.కె. సోను సోయల్, స్పోర్ట్స్ హెడ్ గర్ల్‌గా ఆర్. వైష్ణవి విజయం సాధించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన నాయకులతో పాఠశాల నిబంధనల ప్రకారం ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఎన్నికల ప్రక్రియను విద్యార్థులకు చిన్ననాటి నుంచే ఆచరణాత్మకంగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో స్కూల్ ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలతో పాటు సమాజం పట్ల బాధ్యత, నైతిక విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని పెంపొందిస్తాయని అన్నారు.

విద్యార్థుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేసే నైపుణ్యం కూడా ఇటువంటి ఎన్నికల ద్వారా పెంపొందుతుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నాయకులను ఎన్నుకోవడం, బాధ్యతలను నిర్వర్తించడం ద్వారా విద్యార్థులకు భవిష్యత్‌లో నాయకత్వ లక్షణాలు మరింతగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు.

కార్యక్రమంలో పాఠశాల ఏవో పోల గోవర్ధన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News