- సతీష్ కుమార్ శర్మకు గురుపురస్కారం ప్రధానం
సూర్యాపేట కల్చరల్, ఆగస్టు 22 : జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ రామలింగేశ్వర సహిత త్రిశక్తి అయ్యప్ప ఆంజనేయాస్వామి దేవాలయంకు దక్షిణ భారత దేశంలో ప్రముఖ దేవాలయాలకు మహాశాస్త సేవా సంఘం అందించే ప్రతిష్టాత్మకమైన అన్నపూర్ణ పురస్కారం లభించింది. ఈ సంఘం దక్షిణ భారతదేశంలో ఎంపికన 12 దేవాలయాల్లో జిల్లా కేంద్రానికి చెందిన ఈ దేవాలయం ఉండడం విశేశం. దీంతో పాటు దేవాలయ ప్రధాన అర్చకులు రేంటాల సతీష్ కుమార్ శర్మ దేవాలయంలో నిర్వహిస్తున్న విశేష పూజలతో పాటు ఆయన చేస్తున్న కార్యక్రమాలను గుర్తించిన సంఘం గురుపురస్కారం అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు అర్చకులు మాట్లాడుతూ దేవాలయానికి అన్నపూర్ణ పురస్కారం, సతీష్ కుమార్ శర్మ గురుపురస్కారం అందుకోవడం హర్షణీయమని అన్నారు. అనంతరం పలువురు ఆయనకు శుభాకాంక్షలతో అభినందించారు. ఈ కార్యక్రమంలో అనంతుల సూర్యనారాయణ, అనంతుల గణేష్, దుర్గాప్రసాద్, శ్రీనివాస్, యుగేందర్, శివ, వాసుదేవరావు, తేడ్ల ప్రభాకర్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి