Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇల్లు ఇప్పిస్తానని మాయమాటలు.. దివ్యాంగ మహిళపై లైంగికదాడి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి పెనుగొండ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి:- సవితమ్మ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 23, 2026 01:10 PM

నీటి కుంటలతో భూగర్భ జలాల అభివృద్ధి

నీటి కుంటలతో భూగర్భ జలాల అభివృద్ధి

నీటి కుంటలతో భూగర్భ జలాల అభివృద్ధి
23-08-2026 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కలెక్టర్ దివాకర టి.ఎస్.

కూసుమంచి రైతుల పొలాల్లో నిర్మిస్తున్న నీటి కుంటలు (ఫారం పాండ్లు) భూగర్భ జలాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఐఏఎస్ అన్నారు. కూసుమంచి మండల కేంద్రానికి చెందిన రైతు అర్వపల్లి వెంకటేశ్వర్లు పొలంలో నిర్మిస్తున్న నీటి కుంటను శనివారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ప్రధాన రహదారి నుంచి సుమారు 600 మీటర్ల మేర డొంక రహదారిలో నడుచుకుంటూ వెళ్లి నీటి కుంట నిర్మాణ పనులను పరిశీలించడం విశేషం. వర్షపు నీటిని కుంటల్లో నిల్వ చేయడం ద్వారా నీరు భూమిలోకి ఇంకి సమీపంలోని బోర్లు, బావుల్లో భూగర్భ జలమట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. నీటి నిల్వలు పెరగడంతో భవిష్యత్తులో మత్స్య సంపద అభివృద్ధికి కూడా అవకాశం ఉంటుందని తెలిపారు.

రైతులు తమ పొలాల్లో నీటి సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. నీటి కుంట నిర్మాణం, పనుల పురోగతి, రైతులకు కలిగే ప్రయోజనాలపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి రైతులకు గరిష్ఠ ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కార్యక్రమంలో ఎంపీడీఓ, తహసీల్దార్, కూసుమంచి ఏడీఏ, గ్రామపంచాయతీ సర్పంచ్, ఏఓ, ఏపీఓ, ఈసీ, ఏఈఓ, పంచాయతీ కార్యదర్శి, వ్యవసాయ శాఖ అధికారులు, సంబంధిత టీఏలు, రైతులు, నీటి కుంటల నిర్మాణానికి సంబంధించిన సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

నీటి కుంటలతో భూగర్భ జలాల అభివృద్ధి

Article Image

కలెక్టర్ దివాకర టి.ఎస్.

కూసుమంచి రైతుల పొలాల్లో నిర్మిస్తున్న నీటి కుంటలు (ఫారం పాండ్లు) భూగర్భ జలాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఐఏఎస్ అన్నారు. కూసుమంచి మండల కేంద్రానికి చెందిన రైతు అర్వపల్లి వెంకటేశ్వర్లు పొలంలో నిర్మిస్తున్న నీటి కుంటను శనివారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ప్రధాన రహదారి నుంచి సుమారు 600 మీటర్ల మేర డొంక రహదారిలో నడుచుకుంటూ వెళ్లి నీటి కుంట నిర్మాణ పనులను పరిశీలించడం విశేషం. వర్షపు నీటిని కుంటల్లో నిల్వ చేయడం ద్వారా నీరు భూమిలోకి ఇంకి సమీపంలోని బోర్లు, బావుల్లో భూగర్భ జలమట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. నీటి నిల్వలు పెరగడంతో భవిష్యత్తులో మత్స్య సంపద అభివృద్ధికి కూడా అవకాశం ఉంటుందని తెలిపారు.

రైతులు తమ పొలాల్లో నీటి సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. నీటి కుంట నిర్మాణం, పనుల పురోగతి, రైతులకు కలిగే ప్రయోజనాలపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి రైతులకు గరిష్ఠ ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కార్యక్రమంలో ఎంపీడీఓ, తహసీల్దార్, కూసుమంచి ఏడీఏ, గ్రామపంచాయతీ సర్పంచ్, ఏఓ, ఏపీఓ, ఈసీ, ఏఈఓ, పంచాయతీ కార్యదర్శి, వ్యవసాయ శాఖ అధికారులు, సంబంధిత టీఏలు, రైతులు, నీటి కుంటల నిర్మాణానికి సంబంధించిన సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News