కలెక్టర్ దివాకర టి.ఎస్.
కూసుమంచి రైతుల పొలాల్లో నిర్మిస్తున్న నీటి కుంటలు (ఫారం పాండ్లు) భూగర్భ జలాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఐఏఎస్ అన్నారు. కూసుమంచి మండల కేంద్రానికి చెందిన రైతు అర్వపల్లి వెంకటేశ్వర్లు పొలంలో నిర్మిస్తున్న నీటి కుంటను శనివారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ప్రధాన రహదారి నుంచి సుమారు 600 మీటర్ల మేర డొంక రహదారిలో నడుచుకుంటూ వెళ్లి నీటి కుంట నిర్మాణ పనులను పరిశీలించడం విశేషం. వర్షపు నీటిని కుంటల్లో నిల్వ చేయడం ద్వారా నీరు భూమిలోకి ఇంకి సమీపంలోని బోర్లు, బావుల్లో భూగర్భ జలమట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు కలెక్టర్కు వివరించారు. నీటి నిల్వలు పెరగడంతో భవిష్యత్తులో మత్స్య సంపద అభివృద్ధికి కూడా అవకాశం ఉంటుందని తెలిపారు.
రైతులు తమ పొలాల్లో నీటి సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. నీటి కుంట నిర్మాణం, పనుల పురోగతి, రైతులకు కలిగే ప్రయోజనాలపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి రైతులకు గరిష్ఠ ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కార్యక్రమంలో ఎంపీడీఓ, తహసీల్దార్, కూసుమంచి ఏడీఏ, గ్రామపంచాయతీ సర్పంచ్, ఏఓ, ఏపీఓ, ఈసీ, ఏఈఓ, పంచాయతీ కార్యదర్శి, వ్యవసాయ శాఖ అధికారులు, సంబంధిత టీఏలు, రైతులు, నీటి కుంటల నిర్మాణానికి సంబంధించిన సభ్యులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి