Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థి మృతికి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 23, 2026 07:20 PM

బోనాల పండుగ సందర్భంగా ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

బోనాల పండుగ సందర్భంగా ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

బోనాల పండుగ సందర్భంగా ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే
23-08-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

బోనాల పండుగ సందర్భంగా కోదాడ పట్టణ పరిధిలోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయాన్ని కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ కుటుంబ సమేతంగా సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ.. బోనాల పండుగ తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. గ్రామదేవతలను భక్తిశ్రద్ధలతో కొలుచుకోవడం మన సంస్కృతిలో ఎంతో విశిష్టమైన సంప్రదాయమని పేర్కొన్నారు. ముత్యాలమ్మ అమ్మవారి ఆశీస్సులు కోదాడ నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. కోదాడ నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని కోరుకున్నారు. రైతులు పాడిపంటలతో, ప్రజలు అష్టైశ్వర్యాలతో తులతూగాలని, నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

Sthanikam

బోనాల పండుగ సందర్భంగా ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

Article Image

బోనాల పండుగ సందర్భంగా కోదాడ పట్టణ పరిధిలోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయాన్ని కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ కుటుంబ సమేతంగా సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ.. బోనాల పండుగ తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. గ్రామదేవతలను భక్తిశ్రద్ధలతో కొలుచుకోవడం మన సంస్కృతిలో ఎంతో విశిష్టమైన సంప్రదాయమని పేర్కొన్నారు. ముత్యాలమ్మ అమ్మవారి ఆశీస్సులు కోదాడ నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. కోదాడ నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని కోరుకున్నారు. రైతులు పాడిపంటలతో, ప్రజలు అష్టైశ్వర్యాలతో తులతూగాలని, నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News