ఘటనా స్థలానికి చేరుకున్న ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్
రంగ్ లోకి దిగిన క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్
చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంతంగి గ్రామం చనగలగుట్ట వద్ద ఆదివారం ఓ వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం... అంకిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన రాపోలు దానయ్య (36, తండ్రి: లేట్ వెంకయ్య, కులం: వడ్డెర, వృత్తి: వ్యవసాయం) చనగలగుట్ట సమీపంలో శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న వెంటనే చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్యకు సంబంధించిన ఆధారాలను సేకరించేందుకు వెంటనే క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ను రప్పించారు. వారు ఘటనా స్థలంలో కీలక ఆధారాలను సేకరించడంతో పాటు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్ తెలిపారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి