నల్గొండ: యూరాలజీ, ఆండ్రాలజీ, కిడ్నీ సంబంధిత సమస్యలకు ఆధునిక వైద్య సదుపాయాలతో సమగ్ర చికిత్స అందిస్తున్నట్లు యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ ప్రతినిధులు తెలిపారు. కిడ్నీ, యూరినరీ స్టోన్స్, ప్రోస్టేట్ సమస్యలు, మూత్ర మార్గ ఇన్ఫెక్షన్లు తదితర సమస్యలకు అత్యాధునిక లేజర్, ఎండోయూరాలజీ, మినిమల్లీ ఇన్వేసివ్ విధానాల్లో చికిత్స అందుబాటులో ఉందన్నారు.
యూరో-ఆంకాలజీలో కిడ్నీ, మూత్రాశయం, ప్రోస్టేట్ క్యాన్సర్లకు ఆధునిక, రోబోటిక్ శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నెలకు సుమారు 10 రోబోటిక్ యూరో-ఆంకాలజీ సర్జరీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆండ్రాలజీ విభాగంలో పురుషుల వంధ్యత్వం, అంగస్తంభన, లైంగిక ఆరోగ్య సమస్యలకు గోప్యతతో చికిత్స అందిస్తున్నామన్నారు.
రీనల్ ట్రాన్స్ప్లాంట్ విభాగంలో డోనర్ మూల్యాంకనం, లాపరోస్కోపిక్ డోనర్ నెఫ్రెక్టమీ, కిడ్నీ మార్పిడి వంటి సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నెలకు సుమారు ఐదు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ముందస్తుగా నిపుణులను సంప్రదిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి