బీఆర్ఎస్ నేతలు బేషరతుగా క్షమాపణ చెప్పాలి.
పీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర కో-కన్వీనర్ షేపూరి మధుసూధన్.
నల్గొండ: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్పై బీఆర్ఎస్ నేతలు అనుచిత, అసభ్యకర పదజాలంతో చేసిన వ్యాఖ్యలు హేయమని పీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర కో-కన్వీనర్ షేపురి మధుసూధన్ అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చ తెచ్చేలా ఉన్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ మధుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి, వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కోరారు.
కేటీఆర్ విచారణకు సంబంధించి శ్రీనివాస్రెడ్డి, నవీన్రెడ్డి, డాక్టర్ సంజయ్లు లీకులు ఇస్తూ, నిర్దోషులైన పోలీసుల కాలర్ పట్టుకుని అసభ్య పదజాలంతో దూషించిన ఘటనలపై కూడా కేసులు నమోదు చేయాలని మధుసూధన్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ సంస్థల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీపై ఉందన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి