Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల సృజనాత్మకత.. ఆకట్టుకున్న గణపతి రూపం 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 11, 2026 08:13 PM

సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించాలి – తహసీల్దార్‌కు బీజేపీ వినతి

సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించాలి – తహసీల్దార్‌కు బీజేపీ వినతి

సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించాలి – తహసీల్దార్‌కు బీజేపీ వినతి
11-09-2026 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, అలాగే తెలంగాణ విమోచన పోరాట చరిత్రను శాశ్వతంగా పరిరక్షించేందుకు ‘తెలంగాణ సప్త సంకల్పాలు’ అమలు చేయాలని బీజేపీ చౌటుప్పల్‌ మండల శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం మండల అధ్యక్షులు కైరంకొండ అశోక్‌ నాయకత్వంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ​ఈ సందర్భంగా కైరంకొండ అశోక్‌ మాట్లాడుతూ.. 1948 సెప్టెంబర్‌ 17న తెలంగాణ ప్రాంతానికి రజాకార్ల పాలన నుంచి విముక్తి లభించిన చారిత్రక ఘట్టాన్ని ప్రభుత్వం గౌరవించాలన్నారు. భావితరాలకు ఈ పోరాట స్ఫూర్తిని అందించేందుకు స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ విగ్రహ ఆవిష్కరణ, విమోచన మ్యూజియం ఏర్పాటు, పాఠ్యాంశాల్లో విమోచన చరిత్ర చేరిక, స్మారక వనాల నిర్మాణం, పర్యాటక సర్క్యూట్‌ అభివృద్ధి వంటి ‘సప్త సంకల్పాలను’ తక్షణమే చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ​ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు దూడల భిక్షం, గుజ్జుల సురేందర్‌, చినుకని మల్లేశం, అశోక్‌, పబ్బతి శేఖర్‌, దిండు భాస్కర్, కట్ట కృష్ణ, కడారి ఐలయ్య, బోయ సదానంద్, బాతరాజు ధనంజయ, మునుగాలా అమరేందర్ రెడ్డి, లగ్గొని పాండు, ఆల్మసిపేట గౌతమ్‌, దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించాలి – తహసీల్దార్‌కు బీజేపీ వినతి

Article Image

సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, అలాగే తెలంగాణ విమోచన పోరాట చరిత్రను శాశ్వతంగా పరిరక్షించేందుకు ‘తెలంగాణ సప్త సంకల్పాలు’ అమలు చేయాలని బీజేపీ చౌటుప్పల్‌ మండల శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం మండల అధ్యక్షులు కైరంకొండ అశోక్‌ నాయకత్వంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ​ఈ సందర్భంగా కైరంకొండ అశోక్‌ మాట్లాడుతూ.. 1948 సెప్టెంబర్‌ 17న తెలంగాణ ప్రాంతానికి రజాకార్ల పాలన నుంచి విముక్తి లభించిన చారిత్రక ఘట్టాన్ని ప్రభుత్వం గౌరవించాలన్నారు. భావితరాలకు ఈ పోరాట స్ఫూర్తిని అందించేందుకు స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ విగ్రహ ఆవిష్కరణ, విమోచన మ్యూజియం ఏర్పాటు, పాఠ్యాంశాల్లో విమోచన చరిత్ర చేరిక, స్మారక వనాల నిర్మాణం, పర్యాటక సర్క్యూట్‌ అభివృద్ధి వంటి ‘సప్త సంకల్పాలను’ తక్షణమే చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ​ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు దూడల భిక్షం, గుజ్జుల సురేందర్‌, చినుకని మల్లేశం, అశోక్‌, పబ్బతి శేఖర్‌, దిండు భాస్కర్, కట్ట కృష్ణ, కడారి ఐలయ్య, బోయ సదానంద్, బాతరాజు ధనంజయ, మునుగాలా అమరేందర్ రెడ్డి, లగ్గొని పాండు, ఆల్మసిపేట గౌతమ్‌, దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News