Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! చౌటుప్పల్ కోర్టుకు నూతన భవనం మంజూరు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కృషితోనే నిధులు: న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 11, 2026 07:16 AM

చౌటుప్పల్ కోర్టుకు నూతన భవనం మంజూరు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కృషితోనే నిధులు:

చౌటుప్పల్ కోర్టుకు నూతన భవనం మంజూరు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కృషితోనే నిధులు:

చౌటుప్పల్ కోర్టుకు నూతన భవనం మంజూరు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కృషితోనే నిధులు:
11-09-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ప్రభుత్వ న్యాయవాది వాకిటి నర్సింహారెడ్డి

చౌటుప్పల్ కోర్టుకు నూతన భవనం మంజూరు కావడం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరంతర కృషి ఫలితమేనని చౌటుప్పల్ కోర్టు ప్రభుత్వ న్యాయవాది వాకిటి నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ​గతంలో తాను బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఉన్న సమయంలో యాదాద్రి భువనగిరి జిల్లా కోర్టు అడ్మినిస్ట్రేషన్ జడ్జి జస్టిస్ మాధవి దేవికి నూతన భవన నిర్మాణంపై వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో అప్పటి జడ్జి మారుతి దేవి కోర్టును, దానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారని గుర్తు చేశారు. ఆ తర్వాత ప్రస్తుత జిల్లా జడ్జి జయరాజ్ కూడా స్థలాన్ని సందర్శించి నూతన భవన నిర్మాణ ప్రతిపాదనలను హైకోర్టుకు పంపినట్లు వివరించారు. ​న్యాయవాదుల సమస్యను గ్రహించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపి, భవన మంజూరుకు తీవ్రంగా కృషి చేశారని కొనియాడారు. ఎమ్మెల్యే కృషి ఫలితంగా సర్వే నంబరు 50లోని 5 ఎకరాల స్థలంలో నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసిందన్నారు. కోర్టు భవన నిర్మాణానికి అనుమతులు, నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు న్యాయవాదుల తరఫున ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

చౌటుప్పల్ కోర్టుకు నూతన భవనం మంజూరు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కృషితోనే నిధులు:

Article Image

ప్రభుత్వ న్యాయవాది వాకిటి నర్సింహారెడ్డి

చౌటుప్పల్ కోర్టుకు నూతన భవనం మంజూరు కావడం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరంతర కృషి ఫలితమేనని చౌటుప్పల్ కోర్టు ప్రభుత్వ న్యాయవాది వాకిటి నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ​గతంలో తాను బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఉన్న సమయంలో యాదాద్రి భువనగిరి జిల్లా కోర్టు అడ్మినిస్ట్రేషన్ జడ్జి జస్టిస్ మాధవి దేవికి నూతన భవన నిర్మాణంపై వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో అప్పటి జడ్జి మారుతి దేవి కోర్టును, దానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారని గుర్తు చేశారు. ఆ తర్వాత ప్రస్తుత జిల్లా జడ్జి జయరాజ్ కూడా స్థలాన్ని సందర్శించి నూతన భవన నిర్మాణ ప్రతిపాదనలను హైకోర్టుకు పంపినట్లు వివరించారు. ​న్యాయవాదుల సమస్యను గ్రహించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపి, భవన మంజూరుకు తీవ్రంగా కృషి చేశారని కొనియాడారు. ఎమ్మెల్యే కృషి ఫలితంగా సర్వే నంబరు 50లోని 5 ఎకరాల స్థలంలో నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసిందన్నారు. కోర్టు భవన నిర్మాణానికి అనుమతులు, నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు న్యాయవాదుల తరఫున ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News