హైదరాబాద్: శుభకార్యాల సందర్భంగా హిజ్రాల నుంచి వేధింపులు ఎదురైతే ప్రజలు వెంటనే 112కు ఫోన్ చేయాలని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. ఓ గృహప్రవేశ కార్యక్రమంలో హిజ్రాల వేధింపులకు గురైన వ్యక్తిని పోలీసులు సకాలంలో వచ్చి రక్షించారంటూ ఓ నెటిజన్ చేసిన పోస్టుపై డీజీపీ స్పందించారు.
ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో 112కు సమాచారం అందిస్తే పోలీసులు తక్షణమే స్పందిస్తారని తెలిపారు. వేధింపులపై వెంటనే స్పందించి, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లు డీజీపీ వెల్లడించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి