Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కంచరకుంట్ల కాలనీలో వినాయక మండపం ప్రారంభం మనుషుల్లాగే ఒరంగుటాన్‌ పిల్లల అల్లరి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 10, 2026 07:19 AM

కంచరకుంట్ల కాలనీలో వినాయక మండపం ప్రారంభం

కంచరకుంట్ల కాలనీలో వినాయక మండపం ప్రారంభం

కంచరకుంట్ల కాలనీలో వినాయక మండపం ప్రారంభం
10-09-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

భూదానం అభినందనీయం: మున్సిపల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

పవిత్ర కార్యాలకు, ప్రజా అవసరాలకు స్థలాలను విరాళంగా అందించడం ఎంతో అభినందనీయమని చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ అన్నారు. స్థానిక కంచరకుంట్ల కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని ఆమె బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. మండప నిర్మాణం కోసం 15 లక్షల రూపాయల విలువైన స్థలాన్ని విరాళంగా ఇచ్చి నిర్మాణాన్ని పూర్తి చేయించిన కంచరకుంట్ల సత్తిరెడ్డి - జానకమ్మ దంపతులను ప్రత్యేకంగా అభినందించారు. కాలనీల్లో మౌలిక సదుపాయాలు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను చెత్త సేకరణ వాహనాల్లోనే వేయాలని కాలనీవాసులకు సూచించారు.

​ఈ సందర్భంగా భూదాత కంచరకుంట్ల సత్తిరెడ్డి మాట్లాడుతూ.. కాలనీ అవసరాల కోసం, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మరో 400 గజాల సొంత స్థలాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. కాలనీవాసులు ఒక సంఘంగా ఏర్పడి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని పీఏసీఎస్ చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి సూచించారు. ఏఎంసీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి కాలనీలో మొక్కలు నాటారు. స్థానిక కౌన్సిలర్ పాక చిరంజీవి మాట్లాడుతూ.. కాలనీ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తామంటూ ఎస్ఐఆర్ (SIR) ప్రోగ్రామ్‌పై అవగాహన కల్పించారు. ​ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి, నాయకులు కాసర్ల శ్రీనివాసరెడ్డి, బత్తుల విప్లవ్, ఎస్‌కే జానీబాబు, తాడూరి పరమేష్ తదితరులు పాల్గొన్నారు..

Sthanikam

కంచరకుంట్ల కాలనీలో వినాయక మండపం ప్రారంభం

Article Image

భూదానం అభినందనీయం: మున్సిపల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

పవిత్ర కార్యాలకు, ప్రజా అవసరాలకు స్థలాలను విరాళంగా అందించడం ఎంతో అభినందనీయమని చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ అన్నారు. స్థానిక కంచరకుంట్ల కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని ఆమె బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. మండప నిర్మాణం కోసం 15 లక్షల రూపాయల విలువైన స్థలాన్ని విరాళంగా ఇచ్చి నిర్మాణాన్ని పూర్తి చేయించిన కంచరకుంట్ల సత్తిరెడ్డి - జానకమ్మ దంపతులను ప్రత్యేకంగా అభినందించారు. కాలనీల్లో మౌలిక సదుపాయాలు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను చెత్త సేకరణ వాహనాల్లోనే వేయాలని కాలనీవాసులకు సూచించారు.

​ఈ సందర్భంగా భూదాత కంచరకుంట్ల సత్తిరెడ్డి మాట్లాడుతూ.. కాలనీ అవసరాల కోసం, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మరో 400 గజాల సొంత స్థలాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. కాలనీవాసులు ఒక సంఘంగా ఏర్పడి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని పీఏసీఎస్ చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి సూచించారు. ఏఎంసీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి కాలనీలో మొక్కలు నాటారు. స్థానిక కౌన్సిలర్ పాక చిరంజీవి మాట్లాడుతూ.. కాలనీ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తామంటూ ఎస్ఐఆర్ (SIR) ప్రోగ్రామ్‌పై అవగాహన కల్పించారు. ​ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి, నాయకులు కాసర్ల శ్రీనివాసరెడ్డి, బత్తుల విప్లవ్, ఎస్‌కే జానీబాబు, తాడూరి పరమేష్ తదితరులు పాల్గొన్నారు..

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News