వివేకానంద విద్యానికేతన్లో ఘనంగా కాళోజీ జయంతి.
తెలంగాణ ప్రజల జీవనాడిని తన సాహిత్యంలో ప్రతిబింబించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామంలోని వివేకానంద విద్యానికేతన్ పాఠశాలలో బుధవారం తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు మర్రి రామలింగం కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాళోజీ నారాయణరావు తన పుట్టుక, చావుల మధ్య జీవితాన్ని కేవలం తనకోసం కాకుండా తెలంగాణ ప్రజల కోసం అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. తెలంగాణ భాష, యాస, సంస్కృతి, ప్రజల సమస్యలను తన రచనల ద్వారా ప్రపంచానికి చాటిచెప్పారని అన్నారు. కాళోజీ ఆశయాలను నేటి విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని తెలంగాణ భాషా సంస్కృతుల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దోర్నాల శివ, ఉపాధ్యాయులు శశిరేఖ, రమ, హేమలతతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి