కంపెనీని తరలించాలి.. లేదంటే పునరావాసం కల్పించాలి
కమిషనర్కు వస్రంతండా వాసుల వినతి
కోహాన్స్ కెమికల్స్ కంపెనీ కాలుష్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కంపెనీని జనావాసాలకు దూరంగా తరలించాలని 5వ వార్డు వస్రంతండా వాసులు కోరారు. లేదంటే తండావాసులకు పునరావాసం కల్పించాలని మున్సిపల్ కమిషనర్కు విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ బుధవారం వస్రంతండాను సందర్శించారు. ఈ సందర్భంగా తండావాసులతో మాట్లాడి స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కంపెనీ నుంచి వెలువడుతున్న కాలుష్యం కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తండావాసులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. జనావాసాల మధ్యలో ఉన్న కంపెనీ వల్ల ప్రజల జీవనానికి ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. ప్రజల సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కంపెనీని జనావాసాలకు దూరంగా తరలించాలని, అది సాధ్యం కాకపోతే తండావాసులకు పునరావాసం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కమిషనర్ స్థానిక పరిస్థితులను పరిశీలించి, తండావాసుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి