Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్‌లో యువకుడిపై స్నేహితుల దారుణం: యాసిడ్‌తో దాడి! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 08:27 PM

డీజేలపై నిబంధనలు పాటించాల్సిందే అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు:

డీజేలపై నిబంధనలు పాటించాల్సిందే అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు:

డీజేలపై నిబంధనలు పాటించాల్సిందే అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు:
08-09-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తిరుమలగిరి: గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా డీజేలు, అధిక శబ్దంతో కూడిన సౌండ్ సిస్టమ్‌ల వినియోగంపై ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని నాగారం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు. తిరుమలగిరిలోని శుభమస్తు ఫంక్షన్ హాల్‌లో ఉత్సవ కమిటీలు, విగ్రహ తయారీదారులు, డీజే నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

డీజేల అధిక శబ్దం వల్ల వృద్ధులు, చిన్నారులు, అనారోగ్యంతో ఉన్నవారికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో శబ్ద కాలుష్యానికి కారణమయ్యే విధంగా సౌండ్ సిస్టమ్‌లను వినియోగించరాదని సూచించారు. ప్రభుత్వం, పోలీస్ శాఖ నిర్దేశించిన శబ్ద పరిమితులు, సమయ నిబంధనలను ఉల్లంఘిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఉత్సవ కమిటీలు డీజే నిర్వాహకులకు నిబంధనలపై ముందుగానే అవగాహన కల్పించాలని, నిమజ్జన ఊరేగింపుల్లో కూడా శాంతిభద్రతలకు భంగం కలగకుండా వ్యవహరించాలని కోరారు. యువత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ పోలీస్ శాఖకు సహకరించాలని సీఐ నాగేశ్వరరావు సూచించారు. గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని చర్యలు చేపడుతుందని తెలిపారు.

Sthanikam

డీజేలపై నిబంధనలు పాటించాల్సిందే అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు:

Article Image

తిరుమలగిరి: గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా డీజేలు, అధిక శబ్దంతో కూడిన సౌండ్ సిస్టమ్‌ల వినియోగంపై ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని నాగారం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు. తిరుమలగిరిలోని శుభమస్తు ఫంక్షన్ హాల్‌లో ఉత్సవ కమిటీలు, విగ్రహ తయారీదారులు, డీజే నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

డీజేల అధిక శబ్దం వల్ల వృద్ధులు, చిన్నారులు, అనారోగ్యంతో ఉన్నవారికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో శబ్ద కాలుష్యానికి కారణమయ్యే విధంగా సౌండ్ సిస్టమ్‌లను వినియోగించరాదని సూచించారు. ప్రభుత్వం, పోలీస్ శాఖ నిర్దేశించిన శబ్ద పరిమితులు, సమయ నిబంధనలను ఉల్లంఘిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఉత్సవ కమిటీలు డీజే నిర్వాహకులకు నిబంధనలపై ముందుగానే అవగాహన కల్పించాలని, నిమజ్జన ఊరేగింపుల్లో కూడా శాంతిభద్రతలకు భంగం కలగకుండా వ్యవహరించాలని కోరారు. యువత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ పోలీస్ శాఖకు సహకరించాలని సీఐ నాగేశ్వరరావు సూచించారు. గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని చర్యలు చేపడుతుందని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News