Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రియల్టర్ల ప్రయోజనాల కోసం పూర్వీకుల భూమికి ఎసరు? న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 08:15 PM

నీళ్ల కోసం అడిగితే దెబ్బలా?

నీళ్ల కోసం అడిగితే దెబ్బలా?

నీళ్ల కోసం అడిగితే దెబ్బలా?
08-09-2026 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

బట్టలు ఉతికే నీళ్లనే

తాగుతున్నామంటూ గిరిజన బాలికల కంటతడి.

వాష్‌రూమ్‌ల దుస్థితి.. కనీస వసతులు కరువు.

సమస్యలు చెప్పినా పట్టించుకోవడం లేదని విద్యార్థినుల ఆవేదన

వెంకటాపురం: చదువుకోవాల్సిన గిరిజన బాలికలకు కనీస వసతులు కరువయ్యాయి. తాగునీటి కోసం అడిగితే తమను ప్రిన్సిపాల్ కొట్టారని విద్యార్థినులు ఆరోపిస్తూ కంటతడి పెట్టుకున్నారు. బట్టలు ఉతికేందుకు వినియోగించే నీటినే తాగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని ఐటీడీఏ కాలేజీ సమీపంలో ఉన్న గిరిజన బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఈ దుస్థితి నెలకొందని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.


నీళ్ల సమస్య తీవ్రం.


పాఠశాలలో తాగునీటి సౌకర్యం సరిగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థినులు తెలిపారు. నీళ్లు కావాలని అడిగినందుకు ప్రిన్సిపాల్ తమపై చేయి చేసుకున్నారని ఆరోపించారు. చదువుకోవడానికి వచ్చిన తమతో నీళ్లు మోయిస్తున్నారని, సమస్యను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం చూపడం లేదని వాపోయారు.


వాష్‌రూమ్‌ల దుస్థితి.


పాఠశాలలోని వాష్‌రూమ్‌లు సైతం అధ్వానంగా ఉన్నాయని విద్యార్థినులు చెబుతున్నారు. వాష్‌రూమ్‌ల నుంచి మురుగునీరు బయటకు పొంగి వస్తోందని, దీంతో తీవ్ర దుర్వాసనతో పాటు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస పారిశుద్ధ్య వసతులు కూడా లేవని తెలిపారు.


సమస్య చెబితే బెదిరింపులా?


తమ సమస్యలను సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని విద్యార్థినులు ఆరోపించారు. పైగా సమస్యలు బయటకు చెబితే బెదిరిస్తున్నారని వాపోయారు. ప్రిన్సిపాల్ కూడా అందుబాటులో ఉండరని, కొందరు సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు చేశారు.


తల్లిదండ్రుల ఆగ్రహం.


గిరిజన బాలికల కోసం నిర్వహిస్తున్న రెసిడెన్షియల్ పాఠశాలలోనే కనీస వసతులు లేకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సీతక్క సొంత జిల్లా ములుగులోనే ఆదివాసీ, గిరిజన బాలికలకు ఇలాంటి పరిస్థితులు ఎదురవడం బాధాకరమని వారు అంటున్నారు. ప్రభుత్వం, ఐటీడీఏ అధికారులు తక్షణమే పాఠశాలను తనిఖీ చేసి తాగునీరు, పారిశుద్ధ్యం, వాష్‌రూమ్‌లు తదితర మౌలిక వసతులను కల్పించాలని, విద్యార్థినుల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Sthanikam

నీళ్ల కోసం అడిగితే దెబ్బలా?

Article Image

బట్టలు ఉతికే నీళ్లనే

తాగుతున్నామంటూ గిరిజన బాలికల కంటతడి.

వాష్‌రూమ్‌ల దుస్థితి.. కనీస వసతులు కరువు.

సమస్యలు చెప్పినా పట్టించుకోవడం లేదని విద్యార్థినుల ఆవేదన

వెంకటాపురం: చదువుకోవాల్సిన గిరిజన బాలికలకు కనీస వసతులు కరువయ్యాయి. తాగునీటి కోసం అడిగితే తమను ప్రిన్సిపాల్ కొట్టారని విద్యార్థినులు ఆరోపిస్తూ కంటతడి పెట్టుకున్నారు. బట్టలు ఉతికేందుకు వినియోగించే నీటినే తాగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని ఐటీడీఏ కాలేజీ సమీపంలో ఉన్న గిరిజన బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఈ దుస్థితి నెలకొందని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.


నీళ్ల సమస్య తీవ్రం.


పాఠశాలలో తాగునీటి సౌకర్యం సరిగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థినులు తెలిపారు. నీళ్లు కావాలని అడిగినందుకు ప్రిన్సిపాల్ తమపై చేయి చేసుకున్నారని ఆరోపించారు. చదువుకోవడానికి వచ్చిన తమతో నీళ్లు మోయిస్తున్నారని, సమస్యను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం చూపడం లేదని వాపోయారు.


వాష్‌రూమ్‌ల దుస్థితి.


పాఠశాలలోని వాష్‌రూమ్‌లు సైతం అధ్వానంగా ఉన్నాయని విద్యార్థినులు చెబుతున్నారు. వాష్‌రూమ్‌ల నుంచి మురుగునీరు బయటకు పొంగి వస్తోందని, దీంతో తీవ్ర దుర్వాసనతో పాటు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస పారిశుద్ధ్య వసతులు కూడా లేవని తెలిపారు.


సమస్య చెబితే బెదిరింపులా?


తమ సమస్యలను సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని విద్యార్థినులు ఆరోపించారు. పైగా సమస్యలు బయటకు చెబితే బెదిరిస్తున్నారని వాపోయారు. ప్రిన్సిపాల్ కూడా అందుబాటులో ఉండరని, కొందరు సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు చేశారు.


తల్లిదండ్రుల ఆగ్రహం.


గిరిజన బాలికల కోసం నిర్వహిస్తున్న రెసిడెన్షియల్ పాఠశాలలోనే కనీస వసతులు లేకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సీతక్క సొంత జిల్లా ములుగులోనే ఆదివాసీ, గిరిజన బాలికలకు ఇలాంటి పరిస్థితులు ఎదురవడం బాధాకరమని వారు అంటున్నారు. ప్రభుత్వం, ఐటీడీఏ అధికారులు తక్షణమే పాఠశాలను తనిఖీ చేసి తాగునీరు, పారిశుద్ధ్యం, వాష్‌రూమ్‌లు తదితర మౌలిక వసతులను కల్పించాలని, విద్యార్థినుల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News