దుబ్బాక: రోడ్డు గుంతలు.. ప్రమాదాల మోత.. అధికారుల నిర్లక్ష్యం.. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో సీపీఎం సర్పంచులు వినూత్నంగా నిరసన తెలిపారు. ఆర్అండ్బీ డీఈ అందుబాటులో లేకపోవడంతో ఆయన ఖాళీ కుర్చీకే వినతిపత్రం అందజేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.
దుబ్బాక–మునిపంపుల గ్రామాల మధ్య రహదారి గుంతలమయంగా మారి వాహనదారులకు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నా ఆర్అండ్బీ అధికారులు పట్టించుకోవడం లేదని మునిపంపుల సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం, దుబ్బాక సర్పంచ్ గట్టు నర్సింహా ఆరోపించారు. రోడ్డు గుంతల కారణంగా ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.
రోడ్డు మరమ్మతుల కోసం పలుమార్లు అధికారులను కలిసి సమస్యను వివరించినా స్పందన లేకపోవడంతో ఈ వినూత్న నిరసనకు దిగాల్సి వచ్చిందన్నారు. రెండు రోజుల్లో రోడ్డు మరమ్మతులు చేపట్టకపోతే గ్రామాల ప్రజలతో కలిసి నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. ఆర్అండ్బీ అధికారులు ఇప్పటికైనా స్పందించి తక్షణమే గుంతలను పూడ్చాలని డిమాండ్ చేశారు.
బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న ఆర్అండ్బీ అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యుడు మేడి గణేష్, డీవైఎఫ్ఐ జిల్లా నాయకుడు గుండాల నరేష్, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్కుమార్, వేముల మల్లేశం, కంబాలపల్లి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి