Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రియల్టర్ల ప్రయోజనాల కోసం పూర్వీకుల భూమికి ఎసరు? న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 08:12 PM

మహిళల స్వావలంబనకు ‘కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం’

మహిళల స్వావలంబనకు ‘కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం’

మహిళల స్వావలంబనకు ‘కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం’
08-09-2026 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణకు శ్రీకారం

మహిళలకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలే లక్ష్యం

బొల్ల శివశంకర్ మాజీ జడ్పిటిసి. మునుగోడు నియోజకవర్గం

మహిళలను స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించి, ఆర్థికంగా స్వావలంబులను చేయాలనే లక్ష్యంతో ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. “నైపుణ్యం.. ఆత్మనిర్భరత.. ఆత్మవిశ్వాసం” అనే లక్ష్యంతో మహిళలకు కుట్టుపనిలో శిక్షణ అందించనున్నారు.కుట్టు మిషన్ శిక్షణ ద్వారా మహిళలు నైపుణ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు స్వయం ఉపాధి పొందేందుకు, కుటుంబ ఆర్థిక పరిస్థితికి అండగా నిలిచేందుకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. మహిళల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారికి మెరుగైన భవిష్యత్తు అందించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు.ఈ నెల 9వ తేదీన ఉదయం 11 గంటలకు శిక్షణ కేంద్రం ప్రారంభ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామంలోని సేవిత సహకార సంఘ భవనం వద్ద కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.మహిళలకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు ఆసరా ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాన్ని పలువురు అభినందించారు.“మహిళ సాధికారత.. సమాజ అభివృద్ధికి మూలాధారం” అనే సందేశంతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Sthanikam

మహిళల స్వావలంబనకు ‘కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం’

Article Image

ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణకు శ్రీకారం

మహిళలకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలే లక్ష్యం

బొల్ల శివశంకర్ మాజీ జడ్పిటిసి. మునుగోడు నియోజకవర్గం

మహిళలను స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించి, ఆర్థికంగా స్వావలంబులను చేయాలనే లక్ష్యంతో ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. “నైపుణ్యం.. ఆత్మనిర్భరత.. ఆత్మవిశ్వాసం” అనే లక్ష్యంతో మహిళలకు కుట్టుపనిలో శిక్షణ అందించనున్నారు.కుట్టు మిషన్ శిక్షణ ద్వారా మహిళలు నైపుణ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు స్వయం ఉపాధి పొందేందుకు, కుటుంబ ఆర్థిక పరిస్థితికి అండగా నిలిచేందుకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. మహిళల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారికి మెరుగైన భవిష్యత్తు అందించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు.ఈ నెల 9వ తేదీన ఉదయం 11 గంటలకు శిక్షణ కేంద్రం ప్రారంభ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామంలోని సేవిత సహకార సంఘ భవనం వద్ద కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.మహిళలకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు ఆసరా ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాన్ని పలువురు అభినందించారు.“మహిళ సాధికారత.. సమాజ అభివృద్ధికి మూలాధారం” అనే సందేశంతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News