Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ముర్కుంజాల్ పాఠశాలలో అవ్యవస్థలు.. ఉపాధ్యాయుల తీరుపై సర్పంచ్ ఆగ్రహం న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 09, 2026 01:21 PM

వెలిమినేడు బిడ్డకు ఉస్మానియా డాక్టరేట్‌

వెలిమినేడు బిడ్డకు ఉస్మానియా డాక్టరేట్‌

వెలిమినేడు బిడ్డకు ఉస్మానియా డాక్టరేట్‌
09-09-2026 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన పబ్బు దేవేందర్‌ ఉస్మానియా యూనివర్సిటీ 85వ స్నాతకోత్సవంలో పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. పొలిటికల్‌ సైన్స్‌ విభాగంలో పరిశోధన పూర్తి చేసిన ఆయనకు యూనివర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్ల, వీసీ కుమార్‌ మొగులారం తదితరుల చేతుల మీదుగా డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేశారు.

విద్యా రంగంలో పట్టుదలతో పరిశోధన పూర్తి చేసి డాక్టరేట్‌ సాధించడం పట్ల దేవేందర్‌ ఆనందం వ్యక్తం చేశారు. తన విజయానికి తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహం, గురువుల మార్గదర్శకత్వమే కారణమని తెలిపారు. తాను సాధించిన పీహెచ్‌డీ పట్టాను తన తల్లిదండ్రులు, గురువులకు అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామానికి చెందిన యువకుడు ఉన్నత విద్యలో డాక్టరేట్‌ సాధించడంతో వెలిమినేడు గ్రామస్తులు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేస్తూ దేవేందర్‌కు అభినందనలు తెలిపారు.

Sthanikam

వెలిమినేడు బిడ్డకు ఉస్మానియా డాక్టరేట్‌

Article Image

చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన పబ్బు దేవేందర్‌ ఉస్మానియా యూనివర్సిటీ 85వ స్నాతకోత్సవంలో పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. పొలిటికల్‌ సైన్స్‌ విభాగంలో పరిశోధన పూర్తి చేసిన ఆయనకు యూనివర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్ల, వీసీ కుమార్‌ మొగులారం తదితరుల చేతుల మీదుగా డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేశారు.

విద్యా రంగంలో పట్టుదలతో పరిశోధన పూర్తి చేసి డాక్టరేట్‌ సాధించడం పట్ల దేవేందర్‌ ఆనందం వ్యక్తం చేశారు. తన విజయానికి తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహం, గురువుల మార్గదర్శకత్వమే కారణమని తెలిపారు. తాను సాధించిన పీహెచ్‌డీ పట్టాను తన తల్లిదండ్రులు, గురువులకు అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామానికి చెందిన యువకుడు ఉన్నత విద్యలో డాక్టరేట్‌ సాధించడంతో వెలిమినేడు గ్రామస్తులు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేస్తూ దేవేందర్‌కు అభినందనలు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News