ఆందోల్: కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం.. రైతుల సంక్షేమం అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యత అని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మక్త జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆందోల్ మండలం జోగిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.1.75 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 15 కొత్త షాపులకు ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు తమ పంటలను మార్కెట్కు తీసుకొచ్చే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా మార్కెట్ యార్డులో అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని తెలిపారు.మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేక చొరవతో, ఆయన ఆదేశాల మేరకు రూ.1.75 కోట్ల నిధులతో 15 కొత్త షాపుల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. మార్కెట్ యార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని మంత్రి సూచించినట్లు తెలిపారు.రైతులకు ఇబ్బందులు కలగకుండా పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ రైతుల అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. జోగిపేట మార్కెట్ యార్డును మరింత అభివృద్ధి చేసి రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన మంత్రి దామోదర రాజనర్సింహకు మక్త జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం: మక్త జగన్మోహన్ రెడ్డి
రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం: మక్త జగన్మోహన్ రెడ్డి
Krishna
ఆందోల్: కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం.. రైతుల సంక్షేమం అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యత అని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మక్త జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆందోల్ మండలం జోగిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.1.75 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 15 కొత్త షాపులకు ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు తమ పంటలను మార్కెట్కు తీసుకొచ్చే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా మార్కెట్ యార్డులో అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని తెలిపారు.మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేక చొరవతో, ఆయన ఆదేశాల మేరకు రూ.1.75 కోట్ల నిధులతో 15 కొత్త షాపుల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. మార్కెట్ యార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని మంత్రి సూచించినట్లు తెలిపారు.రైతులకు ఇబ్బందులు కలగకుండా పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ రైతుల అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. జోగిపేట మార్కెట్ యార్డును మరింత అభివృద్ధి చేసి రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన మంత్రి దామోదర రాజనర్సింహకు మక్త జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి