Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం: మక్త జగన్మోహన్ రెడ్డి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 09, 2026 08:12 AM

రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం: మక్త జగన్మోహన్ రెడ్డి

రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం: మక్త జగన్మోహన్ రెడ్డి

రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం: మక్త జగన్మోహన్ రెడ్డి
09-09-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఆందోల్: కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం.. రైతుల సంక్షేమం అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యత అని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మక్త జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆందోల్ మండలం జోగిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.1.75 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 15 కొత్త షాపులకు ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు తమ పంటలను మార్కెట్‌కు తీసుకొచ్చే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా మార్కెట్ యార్డులో అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని తెలిపారు.మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేక చొరవతో, ఆయన ఆదేశాల మేరకు రూ.1.75 కోట్ల నిధులతో 15 కొత్త షాపుల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. మార్కెట్ యార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని మంత్రి సూచించినట్లు తెలిపారు.రైతులకు ఇబ్బందులు కలగకుండా పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ రైతుల అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. జోగిపేట మార్కెట్ యార్డును మరింత అభివృద్ధి చేసి రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన మంత్రి దామోదర రాజనర్సింహకు మక్త జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం: మక్త జగన్మోహన్ రెడ్డి

Article Image

ఆందోల్: కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం.. రైతుల సంక్షేమం అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యత అని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మక్త జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆందోల్ మండలం జోగిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.1.75 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 15 కొత్త షాపులకు ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు తమ పంటలను మార్కెట్‌కు తీసుకొచ్చే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా మార్కెట్ యార్డులో అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని తెలిపారు.మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేక చొరవతో, ఆయన ఆదేశాల మేరకు రూ.1.75 కోట్ల నిధులతో 15 కొత్త షాపుల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. మార్కెట్ యార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని మంత్రి సూచించినట్లు తెలిపారు.రైతులకు ఇబ్బందులు కలగకుండా పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ రైతుల అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. జోగిపేట మార్కెట్ యార్డును మరింత అభివృద్ధి చేసి రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన మంత్రి దామోదర రాజనర్సింహకు మక్త జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News