Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం: మక్త జగన్మోహన్ రెడ్డి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 09, 2026 08:08 AM

మండపాల వివరాలు సకాలంలో నమోదు చేయండి: సీఐ హనుమంతు

మండపాల వివరాలు సకాలంలో నమోదు చేయండి: సీఐ హనుమంతు

మండపాల వివరాలు సకాలంలో నమోదు చేయండి: సీఐ హనుమంతు
09-09-2026 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

హద్నూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో వివిధ గ్రామాలకు చెందిన గణేష్ మండపాల నిర్వాహకులతో హద్నూర్ ఎస్సై దోమ సుజిత్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జహీరాబాద్ రూరల్ సీఐ హనుమంతు హాజరై మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన గణేష్ మండపాల నిర్వాహకులు చిన్నా, పెద్దా తేడా లేకుండా తమ మండపానికి సంబంధించిన పూర్తి వివరాలను policeportal.tspolice.gov.in వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు.గణేష్ విగ్రహం, మండపం ఏర్పాటు చేసే ప్రదేశం, నిర్వాహకుల వివరాలతో పాటు అవసరమైన సమాచారాన్ని సక్రమంగా నమోదు చేసి, ఒక జిరాక్స్ ప్రతిని హద్నూర్ పోలీస్ స్టేషన్‌లో అందజేయాలని కోరారు.నిర్వాహకులు సకాలంలో పూర్తి వివరాలు అందిస్తే మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల ఆధ్వర్యంలో ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని సీఐ హనుమంతు కోరారు.

Sthanikam

మండపాల వివరాలు సకాలంలో నమోదు చేయండి: సీఐ హనుమంతు

Article Image

హద్నూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో వివిధ గ్రామాలకు చెందిన గణేష్ మండపాల నిర్వాహకులతో హద్నూర్ ఎస్సై దోమ సుజిత్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జహీరాబాద్ రూరల్ సీఐ హనుమంతు హాజరై మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన గణేష్ మండపాల నిర్వాహకులు చిన్నా, పెద్దా తేడా లేకుండా తమ మండపానికి సంబంధించిన పూర్తి వివరాలను policeportal.tspolice.gov.in వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు.గణేష్ విగ్రహం, మండపం ఏర్పాటు చేసే ప్రదేశం, నిర్వాహకుల వివరాలతో పాటు అవసరమైన సమాచారాన్ని సక్రమంగా నమోదు చేసి, ఒక జిరాక్స్ ప్రతిని హద్నూర్ పోలీస్ స్టేషన్‌లో అందజేయాలని కోరారు.నిర్వాహకులు సకాలంలో పూర్తి వివరాలు అందిస్తే మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల ఆధ్వర్యంలో ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని సీఐ హనుమంతు కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News