ప్రజా కవి కాళోజీ నారాయణరావు జీవితం, సాహిత్య స్ఫూర్తి, ప్రజా సమస్యలపై ఆయన చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శప్రాయమని డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్ అన్నారు. కాళోజీ జయంతిని పురస్కరించుకొని బుధవారం మానూర్ తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో ఆమె పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి, కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్ మాట్లాడుతూ.. కాళోజీ తన రచనల ద్వారా ప్రజల సమస్యలు, సామాజిక పరిస్థితులను సమాజం ముందుకు తీసుకువచ్చి ప్రజల్లో సామాజిక, రాజకీయ చైతన్యాన్ని నింపారని అన్నారు. సామాన్యుల పక్షాన నిలబడి వారి గొంతుకగా కాళోజీ ప్రజా కవిగా చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. సమాజంలోని అసమానతలు, ప్రజా సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తూ ప్రజలను చైతన్యపరిచారని పేర్కొన్నారు. కాళోజీ ఆలోచనా విధానం, ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత యువతకు స్ఫూర్తిదాయకమని, ఆయన జీవితం, సాహిత్యాన్ని ఆదర్శంగా తీసుకొని సమాజ అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విష్ణు సాగర్,డిప్యూటీ తహసీల్దార్ ఆదర్శ్ కుమార్, ఆర్ఐ శంకర్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ ఖాజా మొయినుద్దీన్, రఘురాములు, నర్సింహారెడ్డి, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రజా కవి కాళోజీ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం:డిప్యూటీ కలెక్టర్
ప్రజా కవి కాళోజీ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం:డిప్యూటీ కలెక్టర్
Krishna
ప్రజా కవి కాళోజీ నారాయణరావు జీవితం, సాహిత్య స్ఫూర్తి, ప్రజా సమస్యలపై ఆయన చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శప్రాయమని డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్ అన్నారు. కాళోజీ జయంతిని పురస్కరించుకొని బుధవారం మానూర్ తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో ఆమె పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి, కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్ మాట్లాడుతూ.. కాళోజీ తన రచనల ద్వారా ప్రజల సమస్యలు, సామాజిక పరిస్థితులను సమాజం ముందుకు తీసుకువచ్చి ప్రజల్లో సామాజిక, రాజకీయ చైతన్యాన్ని నింపారని అన్నారు. సామాన్యుల పక్షాన నిలబడి వారి గొంతుకగా కాళోజీ ప్రజా కవిగా చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. సమాజంలోని అసమానతలు, ప్రజా సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తూ ప్రజలను చైతన్యపరిచారని పేర్కొన్నారు. కాళోజీ ఆలోచనా విధానం, ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత యువతకు స్ఫూర్తిదాయకమని, ఆయన జీవితం, సాహిత్యాన్ని ఆదర్శంగా తీసుకొని సమాజ అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విష్ణు సాగర్,డిప్యూటీ తహసీల్దార్ ఆదర్శ్ కుమార్, ఆర్ఐ శంకర్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ ఖాజా మొయినుద్దీన్, రఘురాములు, నర్సింహారెడ్డి, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి