Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సంగారెడ్డి మహిళా సమాఖ్యను సందర్శించిన 120 మంది బీహార్ అధికారులు మనుషుల్లాగే ఒరంగుటాన్‌ పిల్లల అల్లరి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 09, 2026 07:52 PM

కాళోజి సాహిత్యం చిరస్మరణీయం

కాళోజి సాహిత్యం చిరస్మరణీయం

కాళోజి సాహిత్యం చిరస్మరణీయం
09-09-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

తెలంగాణ భాష, యాస, సంస్కృతిని కాపాడుకోవాలి

అదనపు కలెక్టర్‌ బి. హరిసింగ్‌

తెలంగాణ ప్రజల జీవన విధానం, భాష, యాస, సంస్కృతి, సామాజిక చైతన్యాన్ని తన రచనల ద్వారా చాటిచెప్పిన మహనీయుడు కాళోజి నారాయణరావు అని అదనపు కలెక్టర్‌ బి. హరిసింగ్‌ అన్నారు. కాళోజి జయంతిని పురస్కరించుకుని బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కాళోజి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రజాకవిగా, సామాజిక ఉద్యమకారుడిగా కాళోజి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. సామాన్యుల సమస్యలను తన సమస్యలుగా భావించి, వారి హక్కుల కోసం నిరంతరం పోరాడారని తెలిపారు. సమాజంలోని అన్యాయాలు, అసమానతలు, ప్రజల ఇబ్బందులపై తన రచనల ద్వారా స్పందిస్తూ చైతన్యం తీసుకొచ్చారని పేర్కొన్నారు.

తెలంగాణ భాష, యాసకు ప్రత్యేక గుర్తింపు, గౌరవం తీసుకురావడంలో కాళోజి సాహిత్యం ఎంతో కీలకమన్నారు. తెలంగాణ భాష మన అస్తిత్వానికి ప్రతీక అని, అది కేవలం మాట్లాడే విధానం మాత్రమే కాకుండా జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలు, ఆత్మగౌరవానికి ప్రతిరూపమని వివరించారు. ఆధునిక కాలంలో ఇతర భాషల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో మాతృభాష, తెలంగాణ యాస, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

యువత కాళోజి సాహిత్యాన్ని చదివి ఆయన ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో డీఆర్వో ప్రేమ్‌రాజ్‌, బీసీ సంక్షేమ అధికారి విశాల్‌ధారా, డీఎంహెచ్‌వో వెంకటరమణ, డీడబ్ల్యూవో నరసింహారావు, డీటీవో రవికుమార్‌, డీఎస్‌వో మోహన్‌బాబు, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

కాళోజి సాహిత్యం చిరస్మరణీయం

Article Image

తెలంగాణ భాష, యాస, సంస్కృతిని కాపాడుకోవాలి

అదనపు కలెక్టర్‌ బి. హరిసింగ్‌

తెలంగాణ ప్రజల జీవన విధానం, భాష, యాస, సంస్కృతి, సామాజిక చైతన్యాన్ని తన రచనల ద్వారా చాటిచెప్పిన మహనీయుడు కాళోజి నారాయణరావు అని అదనపు కలెక్టర్‌ బి. హరిసింగ్‌ అన్నారు. కాళోజి జయంతిని పురస్కరించుకుని బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కాళోజి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రజాకవిగా, సామాజిక ఉద్యమకారుడిగా కాళోజి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. సామాన్యుల సమస్యలను తన సమస్యలుగా భావించి, వారి హక్కుల కోసం నిరంతరం పోరాడారని తెలిపారు. సమాజంలోని అన్యాయాలు, అసమానతలు, ప్రజల ఇబ్బందులపై తన రచనల ద్వారా స్పందిస్తూ చైతన్యం తీసుకొచ్చారని పేర్కొన్నారు.

తెలంగాణ భాష, యాసకు ప్రత్యేక గుర్తింపు, గౌరవం తీసుకురావడంలో కాళోజి సాహిత్యం ఎంతో కీలకమన్నారు. తెలంగాణ భాష మన అస్తిత్వానికి ప్రతీక అని, అది కేవలం మాట్లాడే విధానం మాత్రమే కాకుండా జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలు, ఆత్మగౌరవానికి ప్రతిరూపమని వివరించారు. ఆధునిక కాలంలో ఇతర భాషల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో మాతృభాష, తెలంగాణ యాస, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

యువత కాళోజి సాహిత్యాన్ని చదివి ఆయన ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో డీఆర్వో ప్రేమ్‌రాజ్‌, బీసీ సంక్షేమ అధికారి విశాల్‌ధారా, డీఎంహెచ్‌వో వెంకటరమణ, డీడబ్ల్యూవో నరసింహారావు, డీటీవో రవికుమార్‌, డీఎస్‌వో మోహన్‌బాబు, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News