Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సంగారెడ్డి మహిళా సమాఖ్యను సందర్శించిన 120 మంది బీహార్ అధికారులు మనుషుల్లాగే ఒరంగుటాన్‌ పిల్లల అల్లరి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 09, 2026 07:52 PM

గణేష్‌ ఉత్సవాల వేళ.. రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్‌

గణేష్‌ ఉత్సవాల వేళ.. రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్‌

గణేష్‌ ఉత్సవాల వేళ.. రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్‌
09-09-2026 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక.


నార్కెట్‌పల్లి: గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నార్కెట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బ్యాడ్‌హ్యాట్స్‌, రౌడీషీటర్లకు బుధవారం ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉత్సవాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడరాదని పోలీసులు స్పష్టం చేశారు. గొడవలు, దౌర్జన్యాలు, శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలు, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. గణేష్‌ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా, సోదరభావంతో నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలని సూచించారు.చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

ఎవరైనా పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేసి చట్టాన్ని ఉల్లంఘిస్తే, వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిఘా కొనసాగిస్తామని తెలిపారు.

Sthanikam

గణేష్‌ ఉత్సవాల వేళ.. రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్‌

Article Image

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక.


నార్కెట్‌పల్లి: గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నార్కెట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బ్యాడ్‌హ్యాట్స్‌, రౌడీషీటర్లకు బుధవారం ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉత్సవాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడరాదని పోలీసులు స్పష్టం చేశారు. గొడవలు, దౌర్జన్యాలు, శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలు, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. గణేష్‌ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా, సోదరభావంతో నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలని సూచించారు.చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

ఎవరైనా పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేసి చట్టాన్ని ఉల్లంఘిస్తే, వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిఘా కొనసాగిస్తామని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News