Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యువత డ్రగ్స్, గంజాయికి దూరంగా ఉండాలి: సీఐ మన్మధ కుమార్ న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 09, 2026 05:02 PM

ప్రజల గొంతుకగా నిలిచిన కాళోజీ.. ఘనంగా జయంతి వేడుకలు

ప్రజల గొంతుకగా నిలిచిన కాళోజీ.. ఘనంగా జయంతి వేడుకలు

ప్రజల గొంతుకగా నిలిచిన కాళోజీ.. ఘనంగా జయంతి వేడుకలు
09-09-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు జి. అంజయ్య, కార్యదర్శి ఎం. మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో కాళోజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ భాష, యాసకు తన రచనల ద్వారా ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన కాళోజీ నారాయణరావు ప్రజల్లో చైతన్యం కలిగించిన మహనీయుడని వారు పేర్కొన్నారు. తెలంగాణ భాష మన సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం, ఆత్మగౌరవానికి ప్రతీక అని, కాళోజీ సాహిత్య సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. కాళోజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు తెలంగాణ భాషా వైభవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా కాళోజీకి ఘన నివాళులు అర్పిస్తూ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజల గొంతుకగా నిలిచిన కాళోజీ.. ఘనంగా జయంతి వేడుకలు

Article Image

జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు జి. అంజయ్య, కార్యదర్శి ఎం. మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో కాళోజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ భాష, యాసకు తన రచనల ద్వారా ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన కాళోజీ నారాయణరావు ప్రజల్లో చైతన్యం కలిగించిన మహనీయుడని వారు పేర్కొన్నారు. తెలంగాణ భాష మన సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం, ఆత్మగౌరవానికి ప్రతీక అని, కాళోజీ సాహిత్య సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. కాళోజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు తెలంగాణ భాషా వైభవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా కాళోజీకి ఘన నివాళులు అర్పిస్తూ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News