పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
టేకుమట్లలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పటేల్ రమేష్రెడ్డి
ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి అన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని తెలిపారు.బుధవారం సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామంలో బొడ్డు హుసేన్, రాజేశ్వరి దంపతుల నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పటేల్ రమేష్రెడ్డి పాల్గొన్నారు. నూతన గృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. వారు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. పేదల సొంతింటి కలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరుపేద కుటుంబాలకు భరోసాగా నిలుస్తోందన్నారు. ప్రతి అర్హుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని, పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు గట్టు శ్రీనివాస్, టీపీసీసీ అధికార ప్రతినిధి ధరావత్ వెంకన్న నాయక్, టేకుమట్ల సర్పంచ్ గట్టు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి