వినాయక చవితి వేడుకల్లో నిబంధనలు పాటించాల్సిందే!
రామన్నపేట: వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని రామన్నపేట ఎస్ఐ గోపాతి సతీష్ సూచించారు. విగ్రహాల ప్రతిష్ఠకు ముందుగా పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. డీజేలకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు.
మండపాల వద్ద భద్రతా చర్యలు చేపట్టి, ప్రజలు–వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. మద్యం, కులం, రాజకీయాలు, ప్రాంతీయ అంశాలతో వివాదాలకు దారితీసే కార్యక్రమాలకు తావివ్వరాదని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతియుతంగా ఉత్సవాలు నిర్వహించేందుకు నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని ఎస్ఐ కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి