గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు
సరూర్నగర్:
రాబోయే గణేష్ ఉత్సవాల నేపథ్యంలో నిమజ్జన కార్యక్రమాన్ని సురక్షితంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎల్బీనగర్ డీసీపీ అనురాధ, ఐపీఎస్, ఏసీపీ రవీందర్రెడ్డి, మున్సిపల్ అధికారులు శ్రీనివాస్, కార్తిక్ తదితరులు సరూర్నగర్ చెరువును సందర్శించి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు.
భక్తుల భద్రతే ప్రథమ ప్రాధాన్యం
నిమజ్జనం సందర్భంగా ప్రజల రద్దీ, వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలపై అధికారులతో సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిమజ్జన ఏర్పాట్లను నిర్ణీత గడువులో పూర్తి చేసి, గణేష్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి