కోహీర్ మండలం గురుజువాడ గ్రామానికి చెందిన తెలుగు ఉపాధ్యాయుడు సి.హెచ్. విఠల్కు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ పట్టాను ప్రదానం చేసింది. తెలుగు సాహిత్యంలో ‘రుద్రమదేవి’ అంశంపై ఆయన చేసిన పరిశోధనకు గుర్తింపుగా పీహెచ్డీ లభించింది. మంగళవారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన 85వ స్నాతకోత్సవంలో విఠల్ డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. భారత్ బయోటెక్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎం. ఎల్లా ముఖ్య అతిథిగా హాజరై ఆయనకు పట్టాను అందజేశారు. కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్, ఉస్మానియా విశ్వవిద్యాలయం చాన్స్లర్ శివప్రతాప్ శుక్లా అధ్యక్షత వహించారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన విఠల్ పట్టుదలతో చదువుతూ, పరిశోధనలో రాణించి డాక్టరేట్ సాధించడం విశేషం. ఆయన సాధించిన ఈ ఘనత గురుజువాడ గ్రామంతో పాటు కోహీర్ మండలానికి గర్వకారణంగా నిలిచింది. విఠల్ విజయాన్ని పురస్కరించుకుని గురువులు, కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.
‘రుద్రమదేవి’పై పరిశోధనకు అరుదైన గుర్తింపు.. విఠల్కు పీహెచ్డీ
‘రుద్రమదేవి’పై పరిశోధనకు అరుదైన గుర్తింపు.. విఠల్కు పీహెచ్డీ
Krishna
కోహీర్ మండలం గురుజువాడ గ్రామానికి చెందిన తెలుగు ఉపాధ్యాయుడు సి.హెచ్. విఠల్కు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ పట్టాను ప్రదానం చేసింది. తెలుగు సాహిత్యంలో ‘రుద్రమదేవి’ అంశంపై ఆయన చేసిన పరిశోధనకు గుర్తింపుగా పీహెచ్డీ లభించింది. మంగళవారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన 85వ స్నాతకోత్సవంలో విఠల్ డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. భారత్ బయోటెక్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎం. ఎల్లా ముఖ్య అతిథిగా హాజరై ఆయనకు పట్టాను అందజేశారు. కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్, ఉస్మానియా విశ్వవిద్యాలయం చాన్స్లర్ శివప్రతాప్ శుక్లా అధ్యక్షత వహించారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన విఠల్ పట్టుదలతో చదువుతూ, పరిశోధనలో రాణించి డాక్టరేట్ సాధించడం విశేషం. ఆయన సాధించిన ఈ ఘనత గురుజువాడ గ్రామంతో పాటు కోహీర్ మండలానికి గర్వకారణంగా నిలిచింది. విఠల్ విజయాన్ని పురస్కరించుకుని గురువులు, కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి