Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రయాణించే తల్లులకు ఊరట.. మదర్ ఫీడింగ్ రూమ్ ప్రారంభం మనుషుల్లాగే ఒరంగుటాన్‌ పిల్లల అల్లరి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 10, 2026 06:38 PM

టీఆర్‌ఎస్‌లోకి బీఆర్‌ఎస్ నేతల చేరిక.. బాపుమల్ శెట్టి స్వాగతం

టీఆర్‌ఎస్‌లోకి బీఆర్‌ఎస్ నేతల చేరిక.. బాపుమల్ శెట్టి స్వాగతం

టీఆర్‌ఎస్‌లోకి బీఆర్‌ఎస్ నేతల చేరిక.. బాపుమల్ శెట్టి స్వాగతం
10-09-2026 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సిర్గాపూర్ మండలం ఉజ్లంపాడ్ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు తోడే నగేష్, సాదుల సంజీవ్ ముదిరాజ్, దండి యాదయ్యతో పాటు పలువురు నాయకులు నారాయణఖేడ్ నియోజకవర్గం టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి బాపుమల్ శెట్టి స్వగృహంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా బాపుమల్ శెట్టి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. అనంతరం బాపుమల్ శెట్టి మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే కవిత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి బహుజన సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తారని అన్నారు.భూమిలేని నిరుపేదలకు ‘భూలక్ష్మి’ పేరుతో ఎకరం భూమి, ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతుల సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాలు, సామాజిక న్యాయం వంటి కార్యక్రమాలను అమలు చేస్తామని తెలిపారు. ప్రజా సంక్షేమం, బహుజన అభివృద్ధి కోసం పార్టీ కృషి చేస్తుందనే నమ్మకంతో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు మాణిక్యం ముదిరాజ్, సంగమేశ్ చారి, శివరాజ్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

టీఆర్‌ఎస్‌లోకి బీఆర్‌ఎస్ నేతల చేరిక.. బాపుమల్ శెట్టి స్వాగతం

Article Image

సిర్గాపూర్ మండలం ఉజ్లంపాడ్ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు తోడే నగేష్, సాదుల సంజీవ్ ముదిరాజ్, దండి యాదయ్యతో పాటు పలువురు నాయకులు నారాయణఖేడ్ నియోజకవర్గం టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి బాపుమల్ శెట్టి స్వగృహంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా బాపుమల్ శెట్టి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. అనంతరం బాపుమల్ శెట్టి మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే కవిత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి బహుజన సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తారని అన్నారు.భూమిలేని నిరుపేదలకు ‘భూలక్ష్మి’ పేరుతో ఎకరం భూమి, ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతుల సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాలు, సామాజిక న్యాయం వంటి కార్యక్రమాలను అమలు చేస్తామని తెలిపారు. ప్రజా సంక్షేమం, బహుజన అభివృద్ధి కోసం పార్టీ కృషి చేస్తుందనే నమ్మకంతో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు మాణిక్యం ముదిరాజ్, సంగమేశ్ చారి, శివరాజ్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News