Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రయాణించే తల్లులకు ఊరట.. మదర్ ఫీడింగ్ రూమ్ ప్రారంభం మనుషుల్లాగే ఒరంగుటాన్‌ పిల్లల అల్లరి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 10, 2026 06:38 PM

ఐలమ్మ పోరాట పటిమ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం

ఐలమ్మ పోరాట పటిమ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం

ఐలమ్మ పోరాట పటిమ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం
10-09-2026 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా గురువారం సంగారెడ్డి కలెక్టరేట్‌ సమీపంలోని ఆమె విగ్రహానికి జిల్లా అదనపు కలెక్టర్ పాండు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అణగారిన వర్గాల హక్కులు, ఆత్మగౌరవం, సామాజిక సమానత్వం కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.ఆమె ధైర్యసాహసాలు, తెగువ, పట్టుదల నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజంలో సమానత్వం, న్యాయం, ఆత్మగౌరవం కోసం ఐలమ్మ చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఆమె ఆశయాలను స్మరించుకోవడంతో పాటు, సమాజ అభివృద్ధి కోసం వాటిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి జగదీష్, జిల్లా అధికారులు, వివిధ కుల సంఘాల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఐలమ్మ పోరాట పటిమ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం

Article Image

వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా గురువారం సంగారెడ్డి కలెక్టరేట్‌ సమీపంలోని ఆమె విగ్రహానికి జిల్లా అదనపు కలెక్టర్ పాండు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అణగారిన వర్గాల హక్కులు, ఆత్మగౌరవం, సామాజిక సమానత్వం కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.ఆమె ధైర్యసాహసాలు, తెగువ, పట్టుదల నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజంలో సమానత్వం, న్యాయం, ఆత్మగౌరవం కోసం ఐలమ్మ చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఆమె ఆశయాలను స్మరించుకోవడంతో పాటు, సమాజ అభివృద్ధి కోసం వాటిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి జగదీష్, జిల్లా అధికారులు, వివిధ కుల సంఘాల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News