ప్రయాణించే తల్లులు తమ చిన్నారులకు ప్రశాంతమైన, సురక్షితమైన వాతావరణంలో తల్లిపాలు అందించేందుకు సంగారెడ్డి న్యూ బస్టాండ్లో మదర్ ఫీడింగ్ రూమ్ను గురువారం ప్రారంభించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో ‘బేటీ బచావో–బేటీ పడావో’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ గదిని సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ వనిత సంతోష్, జిల్లా సంక్షేమ అధికారి కె. లలిత కుమారి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రయాణ సమయంలో తల్లులు తమ శిశువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తల్లిపాలు అందించేందుకు ఈ సౌకర్యం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన పెంచడంతో పాటు, మహిళలు, చిన్నారుల సంక్షేమానికి ఇటువంటి సౌకర్యాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ సుధాకర్ రావు, సీడీపీఓ చంద్రకళ, మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త గడ్డం పల్లవి, తహసీల్దార్ జయరాం, పీఓ లింగం, అంగన్వాడీ సూపర్వైజర్లు, సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.
ప్రయాణించే తల్లులకు ఊరట.. మదర్ ఫీడింగ్ రూమ్ ప్రారంభం
ప్రయాణించే తల్లులకు ఊరట.. మదర్ ఫీడింగ్ రూమ్ ప్రారంభం
Krishna
ప్రయాణించే తల్లులు తమ చిన్నారులకు ప్రశాంతమైన, సురక్షితమైన వాతావరణంలో తల్లిపాలు అందించేందుకు సంగారెడ్డి న్యూ బస్టాండ్లో మదర్ ఫీడింగ్ రూమ్ను గురువారం ప్రారంభించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో ‘బేటీ బచావో–బేటీ పడావో’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ గదిని సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ వనిత సంతోష్, జిల్లా సంక్షేమ అధికారి కె. లలిత కుమారి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రయాణ సమయంలో తల్లులు తమ శిశువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తల్లిపాలు అందించేందుకు ఈ సౌకర్యం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన పెంచడంతో పాటు, మహిళలు, చిన్నారుల సంక్షేమానికి ఇటువంటి సౌకర్యాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ సుధాకర్ రావు, సీడీపీఓ చంద్రకళ, మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త గడ్డం పల్లవి, తహసీల్దార్ జయరాం, పీఓ లింగం, అంగన్వాడీ సూపర్వైజర్లు, సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి