Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎడ్లకు ప్రత్యేక పూజలు.. కంగ్టిలో ఘనంగా పోలా వేడుకలు మనుషుల్లాగే ఒరంగుటాన్‌ పిల్లల అల్లరి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 10, 2026 07:39 PM

ట్రాన్స్‌జెండర్లు బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు... డీఎస్పీ శివరాం రెడ్డి

ట్రాన్స్‌జెండర్లు బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు... డీఎస్పీ శివరాం రెడ్డి

 ట్రాన్స్‌జెండర్లు బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు...  డీఎస్పీ శివరాం రెడ్డి
10-09-2026 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

చట్ట పరిధిలోనే జీవించాలి ట్రాన్స్‌జెండర్లకు డీఎస్పీ శివరాం రెడ్డి హితవు...

బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు...

వేధింపులుంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచన...

నల్గొండ : సమాజంలో ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవిస్తూ ఇతరులకు ఇబ్బంది కలగకుండా గౌరవప్రదమైన జీవనం సాగించాలని నల్గొండ డీఎస్పీ కే. శివరాం రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ పట్టణ పరిధిలోని ట్రాన్స్‌జెండర్లతో గురువారం ఆయన ఒక ప్రత్యేక అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. వ్యాపార సంస్థలు, దుకాణాలు, ఇళ్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ బలవంతపు వసూళ్లకు దిగడం చట్టరీత్యా నేరమన్నారు. పండుగలు, శుభకార్యాల సమయంలో ప్రజలను బెదిరించడం లేదా అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని, అటువంటి వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా స్వచ్ఛందంగా ఇచ్చే సహాయాన్ని మాత్రమే స్వీకరించాలని, ప్రజల నుంచి వసూళ్లపై ఫిర్యాదులు వస్తే నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

పోలీస్ శాఖ సహకారం ఉంటుంది...

ట్రాన్స్‌జెండర్లు కూడా సమాజంలో సమాన భాగస్వాములేనని, వారి పట్ల ప్రజలు గౌరవభావంతో వ్యవహరించాలని డీఎస్పీ పేర్కొన్నారు. అదే సమయంలో ట్రాన్స్‌జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, వేధింపులు లేదా ఇతర చట్టపరమైన ఇబ్బందులు ఉంటే భయపడకుండా పోలీసులను సంప్రదించవచ్చని, పోలీస్ శాఖ నుంచి పూర్తి సహకారం ఉంటుందని భరోసానిచ్చారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ వ్యవస్థకు సహకరించాలని కోరారు.

​ఈ కార్యక్రమంలో టౌన్ సీఐలు ఆదిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐలు సైదాబాబు, షరీఫ్ తో పాటు నల్గొండ జిల్లాలోని పలువురు ట్రాన్స్‌జెండర్లు పాల్గొన్నారు


Sthanikam

ట్రాన్స్‌జెండర్లు బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు... డీఎస్పీ శివరాం రెడ్డి

Article Image

చట్ట పరిధిలోనే జీవించాలి ట్రాన్స్‌జెండర్లకు డీఎస్పీ శివరాం రెడ్డి హితవు...

బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు...

వేధింపులుంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచన...

నల్గొండ : సమాజంలో ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవిస్తూ ఇతరులకు ఇబ్బంది కలగకుండా గౌరవప్రదమైన జీవనం సాగించాలని నల్గొండ డీఎస్పీ కే. శివరాం రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ పట్టణ పరిధిలోని ట్రాన్స్‌జెండర్లతో గురువారం ఆయన ఒక ప్రత్యేక అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. వ్యాపార సంస్థలు, దుకాణాలు, ఇళ్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ బలవంతపు వసూళ్లకు దిగడం చట్టరీత్యా నేరమన్నారు. పండుగలు, శుభకార్యాల సమయంలో ప్రజలను బెదిరించడం లేదా అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని, అటువంటి వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా స్వచ్ఛందంగా ఇచ్చే సహాయాన్ని మాత్రమే స్వీకరించాలని, ప్రజల నుంచి వసూళ్లపై ఫిర్యాదులు వస్తే నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

పోలీస్ శాఖ సహకారం ఉంటుంది...

ట్రాన్స్‌జెండర్లు కూడా సమాజంలో సమాన భాగస్వాములేనని, వారి పట్ల ప్రజలు గౌరవభావంతో వ్యవహరించాలని డీఎస్పీ పేర్కొన్నారు. అదే సమయంలో ట్రాన్స్‌జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, వేధింపులు లేదా ఇతర చట్టపరమైన ఇబ్బందులు ఉంటే భయపడకుండా పోలీసులను సంప్రదించవచ్చని, పోలీస్ శాఖ నుంచి పూర్తి సహకారం ఉంటుందని భరోసానిచ్చారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ వ్యవస్థకు సహకరించాలని కోరారు.

​ఈ కార్యక్రమంలో టౌన్ సీఐలు ఆదిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐలు సైదాబాబు, షరీఫ్ తో పాటు నల్గొండ జిల్లాలోని పలువురు ట్రాన్స్‌జెండర్లు పాల్గొన్నారు


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News