Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల సృజనాత్మకత.. ఆకట్టుకున్న గణపతి రూపం 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 11, 2026 08:14 PM

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
11-09-2026 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పంతంగి టోల్‌గేట్‌ సమీపంలో ఘటన

– మరొకరికి తీవ్రగాయాలు

గుర్తుతెలియని వాహనాన్ని బైక్‌ వెనుక నుంచి ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన నోముల నాగమ్మ, మల్లయ్య దంపతుల చిన్న కుమారుడు నోముల దీపక్‌ (22) హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం (సెప్టెంబర్‌ 10న) రాత్రి దీపక్‌ తన స్నేహితుడైన దొన్నపోతుల శ్రీకాంత్‌తో కలిసి బైక్‌ (TS09 GB1580)పై హైదరాబాద్‌ నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు.మార్గమధ్యలో పంతంగి టోల్‌గేట్‌ సమీపంలో రాత్రి 9:20 గంటల ప్రాంతంలో వీరి ముందు వెళ్తున్న గుర్తుతెలియని డీసీఎం వాహనం అకస్మాత్తుగా బ్రేక్‌ వేసింది. దీంతో బైక్‌ అదుపుతప్పి ఆ వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం హుక్కు దీపక్‌ తలకు గుచ్చుకోవడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న శ్రీకాంత్‌ తలకు, శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. మరో బైక్‌పై వీరి వెనకాలే వస్తున్న స్నేహితుడు ఉదయ్‌ ప్రమాదాన్ని గమనించి బాధితులను అంబులెన్స్‌లో చౌటుప్పల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. శ్రీకాంత్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. మృతుడి తల్లి నాగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చౌటుప్పల్‌ ఎస్సై డి. నర్సిరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Sthanikam

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

Article Image

పంతంగి టోల్‌గేట్‌ సమీపంలో ఘటన

– మరొకరికి తీవ్రగాయాలు

గుర్తుతెలియని వాహనాన్ని బైక్‌ వెనుక నుంచి ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన నోముల నాగమ్మ, మల్లయ్య దంపతుల చిన్న కుమారుడు నోముల దీపక్‌ (22) హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం (సెప్టెంబర్‌ 10న) రాత్రి దీపక్‌ తన స్నేహితుడైన దొన్నపోతుల శ్రీకాంత్‌తో కలిసి బైక్‌ (TS09 GB1580)పై హైదరాబాద్‌ నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు.మార్గమధ్యలో పంతంగి టోల్‌గేట్‌ సమీపంలో రాత్రి 9:20 గంటల ప్రాంతంలో వీరి ముందు వెళ్తున్న గుర్తుతెలియని డీసీఎం వాహనం అకస్మాత్తుగా బ్రేక్‌ వేసింది. దీంతో బైక్‌ అదుపుతప్పి ఆ వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం హుక్కు దీపక్‌ తలకు గుచ్చుకోవడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న శ్రీకాంత్‌ తలకు, శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. మరో బైక్‌పై వీరి వెనకాలే వస్తున్న స్నేహితుడు ఉదయ్‌ ప్రమాదాన్ని గమనించి బాధితులను అంబులెన్స్‌లో చౌటుప్పల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. శ్రీకాంత్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. మృతుడి తల్లి నాగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చౌటుప్పల్‌ ఎస్సై డి. నర్సిరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News