బీసీ మహిళలు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ల పంపిణీ పథకం కింద ఉచిత కుట్టు మిషన్లు అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. అర్హత ఉన్న మహిళలు సెప్టెంబర్ 15లోగా tgobmms.cgg.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 18 నుంచి 55 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన బీసీ మహిళలు అర్హులు కాగా, నిరుద్యోగులు, నిరుపేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, అనాథ మహిళలకు, అలాగే టైలరింగ్ శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. దరఖాస్తుదారులు ఆధార్, కులం, ఆదాయం, నివాసం, విద్యార్హత, రేషన్ కార్డు, టైలరింగ్ శిక్షణకు సంబంధించిన ధ్రువపత్రాలను సమర్పించాలి. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు ఉండాలి. కుటుంబంలో ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుందని, 2023–24లో బీసీ స్వయం ఉపాధి పథకం కింద ఆర్థిక లబ్ధి పొందిన వారు అర్హులు కాదని కలెక్టర్ స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల వారు సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారికి, పట్టణ ప్రాంతాల వారు సంబంధిత మున్సిపల్ కమిషనర్కు అవసరమైన ధ్రువపత్రాలతో సెప్టెంబర్ 15లోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
బీసీ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి: జిల్లా కలెక్టర్
బీసీ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి: జిల్లా కలెక్టర్
Krishna
బీసీ మహిళలు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ల పంపిణీ పథకం కింద ఉచిత కుట్టు మిషన్లు అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. అర్హత ఉన్న మహిళలు సెప్టెంబర్ 15లోగా tgobmms.cgg.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 18 నుంచి 55 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన బీసీ మహిళలు అర్హులు కాగా, నిరుద్యోగులు, నిరుపేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, అనాథ మహిళలకు, అలాగే టైలరింగ్ శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. దరఖాస్తుదారులు ఆధార్, కులం, ఆదాయం, నివాసం, విద్యార్హత, రేషన్ కార్డు, టైలరింగ్ శిక్షణకు సంబంధించిన ధ్రువపత్రాలను సమర్పించాలి. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు ఉండాలి. కుటుంబంలో ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుందని, 2023–24లో బీసీ స్వయం ఉపాధి పథకం కింద ఆర్థిక లబ్ధి పొందిన వారు అర్హులు కాదని కలెక్టర్ స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల వారు సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారికి, పట్టణ ప్రాంతాల వారు సంబంధిత మున్సిపల్ కమిషనర్కు అవసరమైన ధ్రువపత్రాలతో సెప్టెంబర్ 15లోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి