చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో శ్రావణమాసం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో మహిళా భక్తులతో కుంకుమార్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. వేద పండితులు బ్రహ్మశ్రీ సంతోష్ కుమార్ శాస్త్రి పంతులు వేద మంత్రోచ్ఛారణల నడుమ ఈ పూజా కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా పూర్తిచేశారు.
ఈ వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి, అమ్మవార్ల దివ్య ఆశీస్సులు పూజలో పాల్గొన్న ప్రతి భక్తురాలికీ లభించాలని ఆకాంక్షించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో విలసిల్లాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులను ఈ సందర్భంగా ఆమె ప్రత్యేకంగా అభినందించారు. పూజా అనంతరం భక్తులకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, అన్నదాన దాతలు, స్థానిక భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి