చిట్యాల మున్సిపల్ కమిషనర్కు బీజేపీ వినతి.
చిట్యాల: సెప్టెంబర్ 17ను అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని కోరుతూ బీజేపీ చిట్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. పట్టణ శాఖ అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు కమిషనర్ను కలిసి తెలంగాణ విమోచన చరిత్రను భావితరాలకు అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు.1948 సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. నిజాం పాలన, రజాకార్ల దురాగతాలు, జమీందారీ–జాగీర్దారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలు సాగించిన పోరాటం, హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన చారిత్రక పరిణామాలను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు, మహిళలు, యువతతో పాటు సామాన్య ప్రజలు చేసిన త్యాగాలను స్మరించుకోవాలని కోరారు.తెలంగాణ విమోచన చరిత్రను శాశ్వతంగా పరిరక్షించేందుకు బీజేపీ ప్రతిపాదించిన ‘తెలంగాణ సప్త సంకల్పాలు’ అమలు చేయాలని వారు వినతిపత్రంలో కోరారు. చరిత్ర పరిరక్షణ, అమరవీరుల త్యాగాల గౌరవం, జాతీయ సమైక్యతను బలోపేతం చేయడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకుడు మాస శ్రీనివాస్, సీనియర్ నాయకుడు చికిలం మెట్ల అశోక్, జిల్లా కార్యవర్గ సభ్యుడు జయరాపు రామకృష్ణ, నాయకులు గోషిక వెంకటేశం, కoచర్ల శంకర్రెడ్డి, దుడ్డు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి