ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర చైర్మన్ తోగరి కరుణాకర్.
తెలంగాణ జర్నలిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు జేఏసీ రాష్ట్ర చైర్మన్ తోగరి కరుణాకర్ శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం ముత్యాల రమేష్ చేస్తున్న కృషిని గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.
రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జేఏసీ చైర్మన్ తోగరి కరుణాకర్కు ముత్యాల రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను జేఏసీ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, వారి హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.
ముత్యాల రమేష్ నియామకం పట్ల పలువురు జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు అభినందనలు తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి