Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల సృజనాత్మకత.. ఆకట్టుకున్న గణపతి రూపం 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 11, 2026 09:00 PM

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి. అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి. అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి.   అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు.
11-09-2026 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అడ్డగూడూరు, సెప్టెంబర్‌ 11

సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు సూచించారు. శుక్రవారం అడ్డగూడూరు మండలం మంగమ్మగూడెంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పాఠశాలలోని స్టోర్‌రూమ్‌ను పరిశీలించిన అదనపు కలెక్టర్‌.. విద్యార్థులకు అందించేందుకు నిల్వ ఉంచిన కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. కూరగాయలు తాజాగా ఉన్నాయా? ఆహార పదార్థాలను పరిశుభ్రంగా, సక్రమంగా నిల్వ చేస్తున్నారా? అనే విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆహార పదార్థాలను నిర్దేశిత ప్రమాణాల ప్రకారం నిల్వ చేయాలని సూచించారు. పాఠశాల పరిసరాలు, వంటగది, స్టోర్‌రూమ్‌ తదితర ప్రాంతాల్లో పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని సిబ్బందికి స్పష్టం చేశారు.

కార్యక్రమంలో సంబంధిత అధికారులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి. అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు.

Article Image

అడ్డగూడూరు, సెప్టెంబర్‌ 11

సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు సూచించారు. శుక్రవారం అడ్డగూడూరు మండలం మంగమ్మగూడెంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పాఠశాలలోని స్టోర్‌రూమ్‌ను పరిశీలించిన అదనపు కలెక్టర్‌.. విద్యార్థులకు అందించేందుకు నిల్వ ఉంచిన కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. కూరగాయలు తాజాగా ఉన్నాయా? ఆహార పదార్థాలను పరిశుభ్రంగా, సక్రమంగా నిల్వ చేస్తున్నారా? అనే విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆహార పదార్థాలను నిర్దేశిత ప్రమాణాల ప్రకారం నిల్వ చేయాలని సూచించారు. పాఠశాల పరిసరాలు, వంటగది, స్టోర్‌రూమ్‌ తదితర ప్రాంతాల్లో పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని సిబ్బందికి స్పష్టం చేశారు.

కార్యక్రమంలో సంబంధిత అధికారులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News